కరోనా సోకిందంటే గతంలో బ్రతుకుతాము అనే ధైర్యం ఉండేది.. 14 రోజులు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ, వైద్యుల సలహాలు తో సరైన జాగ్రత్తలు తీసుకునేవాళ్లు.. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి ఆశలు పెట్టుకోవడం మూర్ఖత్వం అవుతుంది. కరోనా సెకండ్ వేవ్ అంచనాలకు మించి వ్యాపిస్తుంది. ఒకసారి పాజిటివ్ వచ్చిందంటే వెంటనే పిట్టల్లా రాలిపోతున్నారు.. అయిన వారికి కంటతడి మిగుల్చుతున్నారు. దేశ వ్యాప్తంగా ఎటు చూసిన రోదనలు మిన్నంటాయి.. అర్ద నాదాలు వినిపిస్తున్నాయి. 


కరోనా మరణాల రేటు పెరగడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.. రోగుల సంఖ్య పెరగడంతో ఆసుపత్రి లో వస్తున్న వారికి చోటు దక్కలేదు. ఇది ఒక కారణం కాగా, రోగులకు ఆక్సిజన్ అందక చనిపోయే వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఈ పరిస్థితి ఢిల్లీ, మహారాష్ట్ర , ఏపిలో ఎక్కువగా వినిపిస్తుంది. ఢిల్లీ లో మాత్రం పరిస్థితి చేజారి పోయింది. హర్యానాలోని హిసార్‌లో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ సోమవారం నాడు ఐదుగురు కోవిడ్ పేషెంట్లు మృతి చెందారు. మెడికల్ ఆక్సిజన్ కొరతే ఈ మరణాలకు కారణమని వారి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆసుపత్రి వెలుపల ఆందోళనకు దిగారు.. 


ఆక్సిజన్ కొరత తో మరణాలు సంభవించడం ఇది మూడోసారి.. అది కూడా కేవలం 24 గంటల్లోనే.. ఐసీయూ లో ముగ్గురు పేషెంట్లు, ఒక పేషెంట్ వార్డు లోనూ మృతి చెందాడు. మాకు ఆక్సిజన్ సరఫరా పరిమితం గానే ఉంది. దీనిపై జిల్లా యంత్రాగాన్ని తరచు చెబుతూనే ఉన్నాం. ఈ విషయం గురించి చాలా సార్లు ప్రభుత్వానికి చెప్పాము.. ఖాళీ సిలెండర్లు నింపి ఇవ్వాల్సిందిగా వెండర్లకు పంపామని, పరిమితమైన నిల్వలు మాత్రమే ఉన్నాయని చెబుతున్నారు. రోగుల సంఖ్య పెరగడంతో మేము ఏమి చేయలేని పరిస్థితి అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆ ఆసుపత్రిలో 114 మంది కరోనా పేషంట్లు చికిత్స పొందుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: