ఎంతో జీవితాన్ని అనుభ‌వించాల్సిన అమ్మాయి. జీవితంలో ఇంకా ఏం చూడ‌ని వ‌య‌స్సులో అనంత‌లోకాల‌కు ప‌య‌న‌మ‌యింది. వంతెన‌పై విగ‌త జీవిగా వేలాడుతూ ద‌ర్శ‌న‌మిచ్చింది. ఉత్తర ప్రదేశ్‌లోని డియోరియా జిల్లాకు చెందిన 17 ఏళ్ల బాలిక మృతదేహం సోమవారం సాయంత్రం మరియు మంగళవారం రాత్రి మధ్య గంటల తరబడి వంతెనపై వేలాడుతూ క‌నిపించింది.  ఇది చూసిన ప‌లువురు హ‌త్య‌గా భావించారు. వంతెన‌పై ఓ శ‌వం వేలాడుతున్న విడియోను స్థానికులు చిత్రీక‌రించారు. ఈ విడియోను చూసిన పోలీసులు ఆ స్థలాన్ని ప‌రిశీలించారు. త‌రువాత దీనిని హ‌త్య‌గా గుర్తించారు. కానీ ఆ హ‌త్య ఎందుకు జ‌రిగిందో పోలీసుల రికార్డులో జ‌త‌ప‌ర‌చ‌లేదు.

   డియోరియో జిల్లాకు చెందిన 17ఏళ్ల అమ్మాయి, త‌న త‌ల్లితో డియోడిరోని వారి అత్త‌గారింట్లో నివ‌సిస్తున్నారు. ఆమె తండ్రి పంజాబ్‌ వ‌ల‌స కార్మికుడిగా ప‌నిచేస్తున్నాడు.  అయితే ఈ విష‌య‌మై ఆ అమ్మాయి అత్త విలేక‌రుల‌తో మాట్లాడారు. ఆమె తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఆ అమ్మాయి మామ‌లు వారి జీవ‌న విధానంతో అసూయ ప‌డేవార‌ని, వాళ్లు ఏం తిన్నా, ఏ బ‌ట్ట‌లు ధ‌రించినా గొడ‌వ ప‌డేవార‌ని తెలిపింది. ఇదే క్ర‌మంలో వారితో ఎప్పుడూ స‌మ‌స్య ఉండేద‌ని చెప్పింది. ఇదే క్ర‌మంలో వారితో గొడ‌వ జ‌రిగింద‌ని దాంతో అమ్మాయిపై వారు రాడ్‌తో దాడి చేశార‌ని. దీంతో ఆమెకు తీవ్ర‌గాయం అయి ప‌డిపోవ‌డంతో త‌న త‌ల్లికి చెప్పారు. అయితే మార్గ మ‌ధ్య‌లోనే వంతెన‌పై దింపింద‌ని ఆమె వివ‌రించింది.

  ఈ సంఘ‌ట‌న గురించి డియోరియా పోలీస్ ఛీఫ్ శ్రీ‌ప‌తి మిశ్రా విడియో ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.."బాలిక తన తాతతో వాగ్వాదానికి దిగి, అతన్ని దుర్భాష‌లాడింద‌ని, దీంతో బాలిక మేనమామలు ఆమెపై దాడి చేశార‌ని తెలిపారు. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి పోయింద‌ని పేర్కొన్నారు. ఈ క్ర‌మంలో బంధువులు ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. కానీ ఆమె దారిలోనే మరణించింది. అమ్మాయి శ‌వాన్ని మాయం చేయాల‌నే ఉద్దేశ్యంతో ఆమె శ‌రీరాని్న న‌దిలో పారేయాల‌ని చూశార‌ని, కానీ అనుకోకుండా బాలిక శ‌వం వంతెన‌కు చిక్కుంద‌ని శ్రీ‌ప‌తి మిశ్రా పేర్కొన్నారు. ఆమెను హ‌త్య చేసిన నిందితులుగా ఉన్న త‌న మేన‌మామ‌లు ప‌రారీలో ఉన్నార‌ని, బాలిక తాత‌ను అరెస్టు చేసిన‌ట్టు పోలీసులు వివ‌రించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: