ఇక కరోనా వచ్చినప్పటి నుంచే ప్రపంచ వ్యాప్తంగా అనేక పరిశోధనలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కరోనా గురించి బయటకు వచ్చిన మరో సర్వే దిమ్మతిరిగి పోయేలా ఉంది. ఈ సర్వే అనేక భయానక నిజాలు బయట ప్రపంచానికి తెలియజేసింది. పోషకాహార లోపంతో బాధపడే వారికి కరోనా చాలా సులువుగా ఎటాక్ అవుతుందట. వీరికి కరోనా సోకితే వారు త్వరగా చనిపోయే ప్రమాదం ఉందని కూడా శాస్త్రవేత్తలు చెపుతున్నారు.
పోషకాహార లోపంతో బాధపడే వారికి అంటు వ్యాధులు తరచుగా ఎటాక్ అవుతాయన్నది ఇప్పటి వరకు మనకు తెలిసిందే. తాజా అధ్యయనంలో పోషకాహార లోపంతో ఉండే 18 - 78 సంవత్సరాల వయస్సులో ఉండే వారికి కరోనా చాలా సులువుగా ఎటాక్ అవుతుందని ఈ పరిశోధన చెప్పింది. వీరిలో రోగ నిరోధక శక్తి చాలా తక్కువుగా ఉండడం వల్ల వీరు కరోనాకు చాలా సులువుగా దొరికిపోతారని ఈ అధ్యయనం చెప్పింది. ఈ పరిశోధన కోసమే 8604 మంది పిల్లలు 94495 మంది పెద్దలపై పరిశోధనలు చేశారు.
ఇందులో పోషకాహార లోపంతో బాధపడేవారే ఎక్కువుగా కరోనా భారీన పడినట్టు తేలింది. ఏదేమైనా పోషకాహారం తీసుకునే విషయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.