అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బసవరాజ్ బొమ్మై ప్రస్తుతం దిల్లీలోనే ఉన్నారని కొద్ది రోజుల్లో ఆయన కేంద్ర నాయకత్వంతో చర్చించి కొత్త కేబినెట్లోకి ఎవరిని తీసుకోవాలనే నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఈ విషయంలో బొమ్మూకే పూర్తి స్వేచ్చ ఉంటుదని తన జోక్యం, ఎలాంటి సూచనలు ఉండవని చెప్పారు. బాగా పనిచేయాలని మాత్రమే కొత్త సీఎంకు సలహా ఇస్తానని, ఇప్పటికే పేదలు, అట్టడుగు వర్గాలకు సాయం చేయడమే లక్ష్యంగా కొన్ని ప్రకటనలు చేశారు అని యడ్డీ తెలిపారు.
2019లో కాంగ్రెస్, జేడీఎస్ నుంచి బయటకు వచ్చి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ఎమ్మెల్యేల పరిస్థితిపై ప్రశ్నించగా.. ఆ విషయంపై పార్టీ అధిష్టానంతో చర్చించి బొమ్మై నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. పార్టీ బలోపేతానికి కృషి చేసేందుకు రాబోయే రోజుల్లో రాష్ట్రంలో పర్యటించనున్నట్టు వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు శ్రమిస్తానని ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు హామీ ఇచ్చానని యడియూరప్ప వివరించారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో 130 కి పైగా స్థానాలు గెలుపొందుతామని దీమా వ్యక్తం చేశారు.
అయితే, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర పెద్దల కలిసేందుకు ఢిల్లీలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో నూతన కేబినెట్లో బెర్త్ దక్కించుకొనేందుకు ఆశావహులు లాబీయింగ్లను కొనసాగిస్తున్నారు.