నోటు కంటే ఓటు ఎంతో పవర్ఫుల్ అని చెబుతూ ఉంటారు. ప్రజాస్వామ్య దేశంలో ఇది ఎన్నో సార్లు నిజమయింది. పాలకులను ఎంచుకునే హక్కు అటు సామాన్య ప్రజలకు మాత్రమే ఉంటుంది. నేటి రోజుల్లో ఓటు ప్రాధాన్యత గురించి అందరికీ తెలిసిపోవడంతో ఇక ఎన్నికలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓట్లు వేసి సరైన పాలకులను ఎంచుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇక ఓటు హక్కుతో నచ్చిన వారిని తమ నాయకులుగా ఎంచుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇలా ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది వజ్రాయుధం గానే మారిపోయింది అని చెప్పాలి. నేటి రోజుల్లో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును బ్రహ్మాస్త్రంగా ఉపయోగిస్తూ పాలకుల భవిష్యత్తునూ నిర్ణయిస్తున్నారు.



 ఇకపోతే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒకరికి ఓటు హక్కు కల్పించేందుకు అటు భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది. ఇక ప్రతి ఏటా ఎంతగానో అవగాహన కల్పిస్తూ ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపడుతుంది భారత ప్రభుత్వం. నేడు అందరూ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అయితే 1950 జనవరి 25వ తేదీన ఓటర్ల దినోత్సవాన్ని ప్రతి ఏటా జరుపుకుంటూ ఉంటారు. అయితే ఇదే రోజు ఎన్నికల సంఘం ఆవిర్భవించిన రోజు కావడం గమనార్హం. ఇక ప్రతి ఏడాది సరికొత్త నినాదం తో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకోవడం చూస్తూ ఉంటాం.


 అయితే జాతీయ ఓటర్ల దినోత్సవం రోజున ప్రతి ఏటా బూత్ స్థాయిలో ఆన్లైన్లో కూడా 18 సంవత్సరాల నుండి ఇంకా ఓటర్ ఐడీ కార్డు నమోదు చేసుకోని వారికి కొత్త ఓటర్ నమోదు దరఖాస్తులను స్వీకరిస్తూ ఉంటారు. అదే సమయంలో దొంగ ఓట్లను నివారించాలనే లక్ష్యంతో పలు కొత్త రూల్స్ కూడా తెరమీదకు తీసుకురావడం కూడా చేస్తూ ఉంటారు. కాగా ప్రస్తుతం ఓటర్ ఐడి కార్డు ఆధార్ కార్డును అనుసంధానం చేయడం జరుగుతుంది అనే విషయం తెలిసిందే  దాదాపు దేశంలో ఉన్న అందరి ఓటర్ ఐడి కార్డులు కూడా ఆధార్ కార్డులతో అనుసంధానం అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: