ఇవాళ్టి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాల్లో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని తెలుగు దేశం నిర్ణయించింది. అయితే పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మాత్రం ఈ సమావేశాలను బహిష్కరిస్తున్నారు. మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాత్రం సమావేశాలకు హాజరవుతారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో లేవెనెత్తాల్సిన అంశాలపై టీడీఎల్పీ ఇప్పటికే నిర్ణయిం తీసుకుంది.


చట్ట సభల్లో  తెలుగు దేశం లేవనెత్తే చర్చనీయాంశాలు ఇవే..
1)    విభజన చట్టం హామీలు - ప్రత్యేక హోదా, రాష్ట్ర హక్కులు
2)    రాష్ట్రంలో నిరుద్యోగం - నైరాశ్యంలో యువత
3)    సంక్షోభంలో రాష్ట్ర రైతాంగం - అన్నదాతల ఆత్మహత్యలు
4)    హైకోర్టు తీర్పు - అమరావతి నిర్మాణం
5)    పోలవరం ప్రాజెక్టు నిర్మాణం – నదుల అనుసంధానం
6)    దిశ చట్టం – మద్య నిషేధం - ప్రభుత్వ మోసం- మహిళలకు రక్షణ లేని రాష్ట్రం
7)    రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ - వివేకా హత్య దోషులకు శిక్ష
8)    పన్నుల భారం- నిత్యావసర వస్తువుల ధరల మోత
9)    స్థానిక సంస్థల నిర్వీర్యం - పాలన వికేంద్రీకరణ అంటూ మోసం
10)    నీరు - చెట్టు, ఉపాధి హామీ పెండింగ్‌ బిల్లులు
11)    కరెంటు బిల్లుల మోత - విద్యుత్‌ కోతలు
12)    దారుణంగా రాష్ట్ర రోడ్ల దుస్థితి - ప్రమాదంలో ప్రాణాలు
13)    రాయలసీమ, ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్యం
14)    ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్థం - ఎపి బ్రాండ్‌ సర్వనాశనం
15)    పెరిగిన ధరలు – కుదేలైన నిర్మాణ రంగం
16)    వివిధ వర్గాల ఉద్యోగుల సమస్యలు- ప్రభుత్వ మోసం
17)    అక్రమ మైనింగ్ – ఇసుక, లాటరైట్, వగైరా...
18)    ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సబ్ ప్లాన్ నిధుల దారి మళ్లింపు
19)    శాసనసభ, మండలిలో మీడియాపై ఆంక్షలు – శాసనసభ ప్రివిలేజ్ పై ఆంక్షలు

మరి ఈ అంశాలపై వైసీపీతో టీడీపీ చేసే మాటల యుద్దం ఏ రేంజ్‌లో ఉంటుందో.. వైసీపీ ఏ రేంజ్‌లో బదులు ఇస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: