ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా తాను భీమవరం వెల్లడానికి అనుమతించాలని ఇంకా అలాగే రక్షణ కూడా కల్పించాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు.ఇక దీనికి హాజరయ్యేందుకు తనకు రక్షణ కల్పించాలని రఘురామ కృష్ణంరాజు హైకోర్టులో పిటిషన్ వేశారు. కాగా, ఈ పిటిషన్ మీద విచారించేందుకు కూడా హైకోర్టు అనుమతినిచ్చింది.'అలాగే ఎంపీగా మీరు పర్యటనకు వెళ్లవచ్చు కదా' అని రఘురామ తరఫు లాయర్ ఉమేష్ చంద్రను ధర్మాసనం ప్రశ్నించడం జరిగింది. ఇక దీనికి సమాధానంగా ... ఏదో ఒక కేసు పెట్టి తన క్లయింట్ ను కూడా అరెస్ట్ చేయాలనుకుంటున్నారని రఘురామ తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. ఎలాంటి కేసులు అనేవి లేకుండా రక్షణ కల్పించాలని.. భీమవరం వెళ్లేందుకు అనుమతించాలని కోర్టును కోరడం జరిగింది.ఇక ఇదిలా ఉండగా, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మే 3 వ తేదీన మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వరుసపెట్టి జరుగుతున్న హత్యలు ఇంకా అత్యాచారలపై మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతల మీద కూడా ఆయన కీలక వ్యాఖ్యాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో మూడు హత్యలు ఇంకా ఆరు మానభంగాలు అని చెబుతోంటే బాదేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.


ఇంకా అలాగే లేని చట్టాల గురించి తమ పార్టీ నేతలు మాట్లాడతారంటూ రఘురామ చురకలంటిచారు. అలాగే ఏపీలో ఎక్కువ నేరాలు జరుగుతున్నాయని క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడిస్తోందని ఆయన దుయ్యబట్టారు.ఇంకా మహిళల మీద నేరాల్లో 2020లో ఏపీ ఎనిమిదవ స్థానంలో ఉందన్న రఘురమ పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల ఘటనల్లో ఏపీ రెండో స్థానంలో ఉందని కూడా వెల్లడించారు. ఇంకా అలాగే మహిళల మీద భౌతిక దాడుల్లో మొదటి స్థానంలో ఉందని 2019 వ సంవత్సరంతో పోలిస్తే రాష్ట్రంలో 63శాతం మేర నేరాలు పెరిగాయని రఘురామ కృష్ణంరాజు వివరించారు. ప్రతి 3 గంటలకు కూడా ఎస్సీలపై ఓ దాడి జరుగుతోందిన ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2021వ సంవత్సరంలో అత్యధిక లాకప్ డెత్ లు ఏపీలోనే నమోదయ్యాయని, ఇక తన అదృష్టం బాగుండి పోలీసుల కస్టడీ నుంచి ప్రాణాలతో బయటపడ్డానంటూ వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: