వైసీపీకి బాగా కలిసివచ్చే జిల్లా నెల్లూరు ఎంపీ సీటుకు ఆ పార్టీ అధినాయకత్వం చాలా రకాలైన న వ్యూహాలతో ముందుకు వస్తోంది అని అంటున్నారు. ఇప్పటి వరకు అనుకున్న రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి వైసీపీకి దూరం కావడంతో పాటు తెలుగు దేశం పార్టీలో చేరేందుకు ప్లాన్ లు చేసుకుంటున్నారు.అందువల్ల వైసీపీ నుంచి సడెన్ గా మరో కొత్త పేరు తెర మీదకు వచ్చింది.అయితే ఆయన ఎవరంటే అరబిందో సంస్థల అధినేత, వైసీపీ రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి అల్లుడికి స్వయాన అన్న అయిన శరత్ చంద్రారెడ్డి. ఆయనకు నెల్లూరు ఎంపీ టికెట్ ని జగన్ మోహన్ రెడ్డి ఇచ్చారని సోషల్ మీడియాలో న్యూస్ తెర వైరల్ అవుతోంది. ఏకంగా జగన్ మోహన్ రెడ్డితో శరత్ భేటీ అయినట్లుగా ఆ పక్కన విజయసాయిరెడ్డి ఉన్నట్లుగా ఫోటో కూడా వేసి మరీ సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు.అయితే ఆ వార్త నిజం కాదు అని అంటున్నారు. వైసీపీ వర్గాలూ ఆ వార్త ఫేక్ అంటూంటే శరత్ కి సన్నిహిత వర్గాలు కూడా ఈ వార్తని ఖండిస్తున్నాయి.


పైగా వ్యాపారాలలో ఉన్న వారు బిజినెస్ పీపుల్ రాజకీయాల్లోకి వెళ్ళాలి అంటే రాంగ్ రూట్ ని ఎంచుకున్నట్లే కూడా ఆ సన్నిహిత వర్గాలు తెలుపుతున్నాయి.సక్సెస్ ఫుల్ గా బిజినెస్ ఫీల్డ్ లోనే ఉండడమే మంచిది తప్ప పాలిటిక్స్ వైపు చూడకూడదని అంటున్నారు. మనసు ప్రశాంతంగా ఉండాలంటే రాజకీయాల జోలికి వెళ్లకపోవడమే మంచిదని అంటున్నారు. మొత్తానికి ఆ విధంగా ఇది ఫేక్ న్యూస్ అని సమాచారం తెలుస్తుంది.అయితే నెల్లూరు ఎంపీ టికెట్ వైసీపీ తరఫున ఎవరికి ఇవ్వబోతున్నారు అన్నది చూడాల్సి ఉంది. శరత్ చంద్రారెడ్డికి ఇంటరెస్ట్ లేదని వార్తలు వస్తున్న క్రమంలో ఆత్మకూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే మేకపాటి విక్రం రెడ్డిని పోటీకి దించుతారని సమాచారం తెలుస్తుంది.అయితే ఆత్మకూరు నుంచే పోటీకి ఆయన సుముఖంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా కొత్త అభ్యర్ధిని వెతుక్కోవాల్సి ఉంటుంది. ఏది ఏమైనా శరత్ చంద్రారెడ్డి ఎంపీగా పోటీ చేయరు అన్నది స్పష్టంగా అర్ధం అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: