ఆంధ్రప్రదేశ్లోని ఈసారి ఎన్నికలలో కూటమితో (బిజెపి తెలుగుదేశం, జనసేన పార్టీ ) వైసీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కోనున్నాయి.. ముఖ్యంగా బిజెపి పార్టీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురుందేశ్వరకి ఇప్పుడు ఒక షాకింగ్ న్యూస్ తగులుతోంది. ఇద్దరు నాయకుల వల్ల పురందేశ్వరి కి ఒక తలనొప్పి రాబోతోందంటూ ప్రముఖ జర్నలిస్ట్ సాయి ఒక వీడియో ద్వారా తెలియజేస్తున్నారు. వాటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఇది వైసిపి వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నటువంటిది.. కర్నూలు జిల్లా బిజెపి అధ్యక్షుడు కనిగిరి నీలకంఠ సోదరుడు కునిగిరి నాగరాజు, మీనాక్షి నాయుడు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే సోదరుడు మధ్యన ఫోన్ సంభాషణ జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఆ సంభాషణను వీరిలో ఎవరో లీక్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సంభాషణను కూడా వీరులోనే ఎవరో రికార్డు చేశారని.. ఆ రికార్డులో ఏముందంటే.. పురందేశ్వరి రూ .3కోట్ల రూపాయల డబ్బు అడిగిందని.. ఒకవేళ ఈ డబ్బు ఇస్తే అదే స్థానాన్ని ఆ జిల్లాలో ఉండే ఆలురు కి మారుస్తానని బేరం పెట్టిందని.. అయితే పక్క ప్లాన్ ప్రకారమే ఈ వీడియోని లీక్ చేసినట్లుగా తెలుస్తోంది.


ఇప్పుడు ఈ విషయం రాజకీయాలలో అటు హాట్ టాపిక్ గా మారుతోంది.. దీనివల్ల పురందేశ్వరి సోషల్ మీడియాలో టార్గెట్ గా మారుతోంది. అందుకు సంబంధించి వీడియో కూడా వైరల్ గా మారుతున్నది. ఈ వీడియోలో సంభాషణ ఎలా ఉందంటే.. టిడిపి బిజెపి పార్టీ మధ్య ఒప్పందం కుదిరిచే విధంగా కనిపిస్తోంది.. ముఖ్యంగా సీట్ల తారుమారు విషయంలో కూడా ఇందులో చాలా క్లియర్ కట్టుగా వినిపిస్తోంది. ఈ ఆడియో ఖచ్చితంగా బిజెపి అతని మాట్లాడుతున్న దాన్ని తెలుగుదేశం పార్టీ మీనాక్షి నాయుడు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే సోదరులు రికార్డ్ చేశాడు.. అంటే బిజెపిని దెబ్బ కొట్టడం కోసం ఈ కథ నడుస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ విషయాన్ని వైసిపి పార్టీ వాళ్లు స్ప్రెడ్ చేస్తున్నారు.. దీన్నిబట్టి చూస్తే పురందేశ్వరికి తెలుగు తమ్ముళ్ల షాక్ ఇచ్చేలా కనిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: