విశాఖ:  విశాఖ రాజకీయం చాలా రసవత్తరంగా సాగుతుంది. అందులోనూ గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ అయితే చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ ఇంట్రెస్టింగ్ పొలిటికల్ వార్ లో అధికార పార్టీ అయిన వైసీపీ నుంచి అమర్నాథ్‌, తెలుగు దేశం పార్టీ తరపున శ్రీనివాసరావు బరిలో దిగారు.ఇప్పుడు అమర్నాథ్‌, శ్రీనివాసరావు కీలక నియోజకవర్గం అయిన గాజువాకాలో విజయం కోసం ఢీ అంటే ఢీ అనే విధంగా పోటా పోటీగా తలపడుతున్నారు.వీరిలో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో అనేది చాలా ఆసక్తికరంగా మారింది.ఇక వీరి చరిత్ర కనుక చూసుకున్నట్లయితే గతంలో వీళ్ల తండ్రులు కూడా పరస్పరం పోటీ పడ్డారు. గుడివాడ అమర్నాథ్ తండ్రి గుడివాడ గురునాధరావు, శ్రీనివాసరావు తండ్రి పల్లా సింహాచలం గతంలో ఎమ్మెల్యేలుగా పని చేశారు. 35 ఏళ్ల క్రితం గురునాధరావు ఇంకా సింహాచలం ప్రత్యర్థులుగా పోటీపడటం గమనార్హం. అప్పట్లో పెందుర్తి నియోజకవర్గంలోనే ఈ గాజువాక ఉండేది. 1989 వ సంవత్సరం ఎన్నికల్లో పెందుర్తి నియోజకవర్గంలో సింహాచలంపై గురునాధరావు గెలిచారు.


 ఇప్పుడు మూడున్నర దశాబ్దాల తర్వాత మళ్లీ వీళ్ల వారసుల మధ్య పొలిటికల్ వార్ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది.ఇప్పుడు అమర్నాథ్‌, శ్రీనివాసరావు మధ్య టఫ్ ఫైట్ అనేది నడుస్తోంది.వీరు ఇద్దరూ కూడా తొలిసారి ఎంపీగా పోటీ చేసినప్పుడు ఓటమి పాలవ్వడం జరిగింది. ఆ తర్వాత ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. పల్లా శ్రీనివాసరావు మూడవ సారి ఎమ్మెల్యే ఎన్నికల్లో బరిలో దిగారు. గుడివాడ అమర్నాథ్ ఏమో రెండో సారి పోటీకి సిద్ధమయ్యారు.గాజువాక నుంచి గుడివాడ అమర్నాథ్ తొలిసారి పోటీ చేయడంతో తన ప్రత్యర్థి అయిన పల్లా శ్రీనివాసరావుతో సమరానికి సై అంటున్నారు. గత ఎన్నికల్లో గుడివాడ అమర్నాథ్‌.. అనకాపల్లి నుంచి పోటీ చేశారు. ఇలా అప్పుడు తండ్రుల మధ్య జరిగిన పోటీ.. ఇప్పుడు తనయుల మధ్య గట్టి సమరంగా మారింది. ఇప్పుడు ఈ ఇద్దరు నాయకులు కూడా తమదైన శైలిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మరి వీళ్ళ ఇద్దరిలో ఎవరు విజయం సాధిస్తారో అన్నది మాత్రం జనాల చేతుల్లో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: