అంటే ఈ లెక్కన మొదటగా సోషల్ మీడియాలో నారా లోకేష్ పోస్ట్ చేశారు. పోస్ట్ చేయడమే కాకుండా.. సీఎం జగన్, పిన్నెల్లి టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశారు నారా లోకేష్. అయితే.. నారా లోకేష్ ఎలా రిలీజ్ చేస్తాడని ఇప్పుడు కొత్త అంశాన్ని వైసీపీ తెరపైకి తీసుకొచ్చింది. అటు ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ఇక పిన్నెల్లి పిటిషన్పై విచారణ కూడా ప్రారంభం అయింది. ఈ సందర్భంగా నారా లోకేష్ నే టార్గెంట్ చేసే విధంగా కోర్టుకు పూస గుచ్చి చెబుతున్నారు పిన్నెల్లి రామకృష్టారెడ్డి తరఫు న్యాయవాది.
సోషల్ మీడియాలో మొదటగా ఈవీఎం ధ్వంసం చేసిన వీడియోను నారా లోకేష్ పోస్ట్ చేశారన్నారు. దీనిని ఆధారంగా కేసు నమోదు చేయటం జరిగిందని...నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ కు వెళ్లటం సరికాదని కోర్టుకు తెలిపారు పిన్నెల్లి రామకృష్టారెడ్డి తరఫు న్యాయవాది. ఎన్నికల కమిషన్ అరెస్ట్ చేయాలని నేరుగా ఆదేశాలు ఇవ్వటం సరికాదు...లోకేష్ ట్విట్టర్ లో పెట్టిన వీడియో ఆధారంగా ఇదంతా చేస్తున్నారని వివరించారు.
ఈవీఎం ద్వంసం విషయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇది చేశారని విధుల్లో ఉన్న పీఓ చెప్పారని... పోలీసులు కేసు నమోదు చేసిన FIR లో కూడా ఇదే అంశాలు ఉన్నాయన్నారు. ప్రతిపక్షంలో ఉన్న నారా లోకేష్ ట్విట్టర్ లో ఈ వీడియో ను పోస్ట్ చేశారు.. కాబట్టి అది మార్ఫింగ్ వీడియో కూడా అయ్యే అవకాశం ఉందని కోర్టుకు వెల్లడించారు పిన్నెల్లి రామకృష్టారెడ్డి తరఫు న్యాయవాది. ఇలా నారా లోకేష్ చుట్టు ఈ ఇష్యూను డైవర్ట్ చేస్తోంది వైసీపీ. మరి దీనిపై ఎన్నికల సంఘం, కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.