
విద్యా సంవత్సరం ఏడాది ముగిసిన ఇంకా తల్లికి వందనం డబ్బులను తల్లుల ఖాతాలో జమ చేయకపోవడంతో చాలామంది విమర్శిస్తూ ఉన్నారు. అయితే పేద విద్యార్థుల తల్లితండ్రులకు ఆసరాగా ఉంటుందని.. మే నెలలోపు 15000 ఒకేసారి ఇస్తానంటూ గత కొన్ని నెలలుగా చెబుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా మరొక ట్విస్ట్ ఏమిటంటే అది కూడా ఇన్స్టాల్మెంట్ ప్రకారం ఇవ్వబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఒక్కసారిగా ప్రజలందరూ కూడా విమర్శలు తెలియజేస్తున్నారు.
ఈ లెక్కను చూసుకుంటే కనీసం 15వేల రూపాయలు వేయడానికి మూడు నెలల సమయం వరకు తీసుకుంటారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఇన్స్టాల్మెంట్ ప్రకారం ఇవ్వబోతున్నారనే విషయం పైన ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. ఇప్పటికే సూపర్ సిక్స్ హామీలతో పాటుగా ఇచ్చిన హామీల సంగతి సీఎం చంద్రబాబు మరిచిపోయారనే విధంగా చాలామంది విమర్శిస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో తల్లికి వందనం పథకం పై మెలిక పెడితే ఎలా అంటూ చాలామంది కార్యకర్తలు కూడా తెలియజేస్తున్నారు.. ఇంకా తల్లికి వందనం పథకానికి సంబంధించి విధివిధానాలను కూడా సూచించలేదు. గతంలో కారు, భూమి ఎక్కువ ఉన్న, 300 యూనిట్లు దాటిన వారికి ఇవ్వాలని టిడిపినే డిమాండ్ చేసింది వైసిపి అధికారంలో.. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో వీరికి ఇస్తారా ఇవ్వరా అనేది చూడాలి.