
ప్రధానమంత్రి కార్యాలయం జారీ చేసిన ప్రకటనలో, ఆసిమ్ మునీర్ ఆపరేషన్ బున్యన్-ఉమ్-మర్సూస్లో చూపిన నాయకత్వం, ధైర్యం కారణంగా ఈ హోదా కల్పించినట్లు తెలిపింది. ఈ ఆపరేషన్ భారత్ దాడులకు ప్రతిస్పందనగా నిర్వహించబడిందని పాకిస్తాన్ వాదిస్తోంది. అయితే, సామాజిక మాధ్యమాల్లో ఈ పదోన్నతిని విమర్శిస్తూ, ఓటమి తర్వాత కూడా ఇటువంటి సన్మానం ఎందుకని ప్రశ్నలు వెల్లువెత్తాయి. కొందరు దీనిని రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కొనేందుకు మునీర్ చేసిన వ్యూహంగా భావిస్తున్నారు. ఈ నిర్ణయం సైన్యం పౌర ప్రభుత్వంపై ఆధిపత్యాన్ని మరింత బలపరుస్తుందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఆసిమ్ మునీర్ 2017లో సైనిక గూఢచార శాఖకు నాయకత్వం వహించారు, 2018లో ఐఎస్ఐ చీఫ్గా కొద్ది కాలం పనిచేశారు. 2022లో ఆర్మీ చీఫ్గా నియమితులైన ఆయన, పాకిస్తాన్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ పదోన్నతి ద్వారా మునీర్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకున్నారని విశ్లేషకులు అంటున్నారు. భారత్తో జరిగిన ఘర్షణలో పాకిస్తాన్ 11 వైమానిక స్థావరాలను కోల్పోయినట్లు సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో, ఈ పదోన్నతిని ఓటమిని కప్పిపుచ్చే ప్రయత్నంగా కొందరు అభివర్ణిస్తున్నారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.