రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కవిత తన వ్యాఖ్యల ద్వారా, లేఖల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. కవిత రాసిన లేఖ తాజాగా సోషల్ మీడియా వేదికగా వైరల్ కాగా ఆ లేఖ తాను రాసిన లేఖేనని అయితే ఎవరు ఆ లేఖను లీక్ చేశారనే ప్రశ్నకు మాత్రం తన దగ్గర సమాధానం లేదని ఆమె చెప్పుకొచ్చారు. అయితే కవిత చేసిన ఈ కామెంట్లు ఒకింత సంచలనం అయ్యాయి.
 
అయితే కవిత వైఖరి వల్ల పార్టీకి లాభం కంటే నష్టం ఎక్కువగా కలిగే ఛాన్స్ అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కవిత టార్గెట్ గా ఇతర పార్టీల నేతలు సైతం తమకు తోచిన విషయాలు చెబుతూ బీఆర్ఎస్ కు తీవ్ర నష్టం చేకూర్చేలా వ్యవహరిస్తున్నారు. భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో బీ.ఆర్.ఎస్ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
కవితను ఎవరు గైడ్ చేస్తున్నారో తెలీదు కానీ రాంగ్ వేలో ఆమెను నడిపిస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. కవిత భవిష్యత్తు రాజకీయ వ్యూహాలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల మద్దతు పూర్తిస్థాయిలో ఏ రాజకీయ పార్టీకి అయితే లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఐదేళ్లకే పరిమితం అయ్యే ఛాన్స్ ఉంది.
 
ఒకరిద్దరు మినహా బలమైన లీడర్లు లేకపోవడం కూడా తెలంగాణకు మైనస్ అవుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మంచి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నా అన్ని వర్గాల ప్రజలకు పథకాలు అందడం లేదు. రాష్ట్రంలోని ఉద్యోగుల్లో సైతం ఒకింత అసంతృప్తి ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మినహా ఇతర ప్రాంతాలు అభివృద్ధి చెందడం లేదనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి:

brs