ఇక సరిగ్గా 10 సంవత్సరాల కిందట మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతో సంచలంగా మారిన ఈ కేసులో ఇద్దరూ ప్రముఖులు .. ఇక ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు .. ఇక గతంలోనూ వీరిలో ఒకరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ . ఇప్పుడు ఇద్దరూ ఒకేసారి ఆ పదవుల్లో ఉండగా ఈ కేసు ఇప్పుడు పదేళ్లు పూర్తి చేసుకుంది .. అలాగే తెలంగాణ కోసం అత్యంత తీవ్రంగా ఉద్యమం తర్వాత 2014 జూన్ 2న ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో తెలంగాణ సాధన లక్ష్యాన్ని చేరుకుంది .. ఇక దాంతో తెలుగు రాజకీయాలు రెండుగా చీలిపోయాయి .. అయితే తెలంగాణ ఏర్పడిన సరిగ్గా ఏడాదిలోపే .. తొలి సంవత్సరం జరుపుకోకముందే ఓ పెద్ద రాజకీయ దూమారం బయటకు వచ్చింది .. అది ఓటుకు నోటు కేసు ..


2015 మే 31న ఊహించ‌ని విధంగా చోటు చేసుకున్న పరిణామం తెలుగు రాష్ట్రాలను గట్టిగా కుదుపేసింది .. ఇక అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న తెలంగాణ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి శాసనమండలి ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి వేం నరేందర్ రెడ్డి తరఫున గెలుపు బాధ్యతలను తీసుకున్నారు .. అయితే , వేంకు మద్దతు తెలిపాలంటూ నామినేట్ ఎమ్మెల్సీ స్టీఫెన్సన్ కు 50 లక్షలు ఇవ్వబోతుండగా ఏసీబీకి చిక్కారన్నది అభియోగం ... అయితే ఈ కేసు ప్రస్తుతం ఏసీబీ ప్రత్యేక కోర్టు విచారణలో ఉంది .. ఇప్పటికే కొన్నిసార్లు రేవంత్ విచారణకు కూడా వెళ్లారు .. అయితే 2018 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరిన రేవంత్ 2023 ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించడంతో తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు .. అయితే 2017 లో ఓటుకు నోటు కేసు నమోదైన సమయంలో విభజిత ఏపీ ముఖ్యమంత్రిగా టిడిపి అధినేత చంద్రబాబు ఉన్నారు .. అలాగే 2019 ఎన్నికల్లో ఓడిపోయిన .. ఇప్పుడు 2024లో గెలిచి మరోసారి ముఖ్యమంత్రిగా  ఎన్నికయ్యారు ..



కాగా చంద్రబాబు , రేవంత్ ఇద్దరు సీఎంలు గా ఉండగా ఓటుకు నోటు కేసు .. తేదీ (మే 31) రావటం ఇదే మొద‌టిసారి కావటం ఇక్కడ గమనార్హం .. అయితే ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడి చార్జి షిట్‌లో చంద్రబాబు పేరు ప్రస్తావించారు .. అయితే ఏసీబీ ఛార్జ్ షీట్‌లో మాత్రం లేదు .. దీంతో ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు .. అయితే ఓటుకు నోటు కేసు తెలంగాణను మించి ఏపీలో రాజకీయ దుమారం రేపింది .. ఈ కేసును చూపించే తెలంగాణ అప్పటి సీఎం కేసీఆర్ .. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబును హైదరాబాదు నుంచి గెంటేసారని ప్రతిపక్ష వైసిపి ఆరోపణలు కూడా చేసింది . అలాగే ఉమ్మడి రాజధానిగా మరో 9 ఏళ్ళు హైదరాబాదులో కొనసాగే అవకాశాన్ని వదిలేసారని కూడా చెప్పకు వచ్చింది .. వాటికి తగినట్లుగానే 2017 అక్టోబర్లో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి శంకుస్థాపన కూడా చేసి .. అక్కడే ఉండటం మొదలుపెట్టారు .. ఇక ఓటుకు నోటు కేసులో అప్పటి టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడా ఉన్నారు .. అలాగే రేవంత్ ను మే 31న అరెస్టు చేయగా .. జూన్ 15న బెయిల్ వచ్చింది ..

మరింత సమాచారం తెలుసుకోండి: