భారతదేశ సుప్రీం కోర్టు ఇటీవల వెలువరించిన ఒక ముఖ్యమైన న్యాయ తీర్పు ఇది. ఈ తీర్పు ప్రకారం, ఇక పై ఒక ఉద్యోగి ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లే సమయంలో ఏదైన  ప్రమాదం జరిగితే అది ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో భాగమే అని భావించాలి. ప్రతి ఒక్కరు దీనికి అర్హులు. అందువల్ల, అలాంటి ప్రమాదానికి సంబంధించిన బాధ్యత కూడా కంపెనీదేనని న్యాయస్థానం క్లీయర్ గా స్పష్టం చేసింది. ప్రమాదం జరిగినప్పుడు  ఆ ప్రమాదానికి, సదరు ఉద్యోగానికి మధ్య సంబంధం ఉన్నట్లు పక్కాగా నిరూపిస్తే ఈసీ చట్టం కింద ఆ ఉద్యోగికి పూర్తి పరిహారం లభిస్తుందని పేర్కొంది.  

వాచ్‌మెన్ మరణించిన కేసులో ఇటివలే బాంబే హైకోర్టు తీర్పును కొట్టివేస్తూ.. ఉద్యోగి ప్రయాణాన్ని కూడా ఉద్యోగంలో భాగంగానే పరిగణించాలని  అంటూ కోర్టు తీర్పు వెల్లడించింది. సదరు కంపెనీ అతడికి నష్ట పరిహారం చెల్లించాల్సిందేనని కోర్టు తేల్చి చెప్పింది. "Course of Employement" పరిధిలో ఇది వర్తిస్తుంది. ఉద్యోగి ఉద్యోగ బాధ్యతల నిమిత్తం ప్రయాణిస్తున్నప్పుడు జరిగిన ప్రమాదం కూడా పనిచేసే సమయంలో జరిగిందే అని భావించాలి. ఇందులో ఎంప్లాయర్ బాధ్యత ఏంతంటే.. కంపెనీ/సంస్థ తమ ఉద్యోగి ప్రయాణ సమయంలో జరిగిన ప్రమాదానికి బీమా పరిధిలోకి తీసుకొని పరిహారం చెల్లించాలి.

ఇది కార్మికుల హక్కులకు పెద్ద బలం.భవిష్యత్తులో కంపెనీలు బీమా మరియు ఇతర భద్రత చర్యలపై మరింత శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. ఉద్యోగులు పని అనంతర ప్రయాణంలో కూడా ఆఫీషియల్ కవరేజ్ ఉంటుందని ఇది సూచిస్తుంది. ఈ తీర్పు కార్మిక హక్కుల పరిరక్షణలో మైలురాయిగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా ఉద్యోగుల పరిహార చట్టం 1923 కింద పరిహారం క్లెయిమ్ చేసుకోవడంపై చాలా కాలంగా ఉన్న అస్పష్టతపై ఇటీవల సుప్రీం కోర్టు క్లారిటీ ఇచ్చింది. ప్రమాదం ఉద్యోగ సంబంధితంగా ఉండాలి అంటే.. ఆ ప్రమాదం జరిగిన పరిస్థితులు, సమయం, స్థలం, ఉద్యోగం మధ్య ఒక స్పష్టమైన 'నెక్సస్' అనగా ప్రత్యక్ష సంబంధం ఉండాలని కోర్టు క్లారిటీగా చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: