2007 విజయవాడలో జరిగిన ఆయేషా మీరా అనే విద్యార్థి హత్య కేసుకు సంబంధించి అనేక మలుపులు తిరిగి చివరికి మళ్ళీ సత్యంబాబు వద్దకు వచ్చింది. 2008 ఆగస్టులోనే సత్యం బాబును అరెస్టు చేశారు. దీంతో విజయవాడ మహిళ సెషన్స్ కోర్టు జీవిత ఖైదీ విధించినప్పటికీ .. 2017 మార్చి 31న హైకోర్టు ఈ కేసును కొట్టివేసి మరి సత్యంబాబు నిర్దోషి అంటూ తీర్పు ఇచ్చింది. ఈ విషయంపై ఆయేషా తల్లిదండ్రులు కూడా హైకోర్టు ఆశ్రయించగా అప్పుడు ఈ కేసుని దర్యాప్తు కోసం సిబిఐకి అప్పగించారు. సిబిఐ అధికారులు కేసు దర్యాప్తు చేసి 2025 లో మూడు నెలల క్రితం ఒక నివేదికన హైకోర్టుగా అందించారు.


 ఈ విషయం పైన మీడియా నిర్వహించినటువంటి సమావేశంలో  ఆయేషా తల్లి  ఇలా మాట్లాడారు..తమ కూతురి న్యాయం కోసం 18 ఏళ్లుగా పోరాడుతూనే ఉన్న ఈ కేసులో ఎలాంటి న్యాయం జరగలేదని ఈ కేసులో సత్యంబాబు నిర్దోషి అని తాము నమ్ముతున్నట్లు తెలిపారు.. మళ్లీ సత్యం బాబు పైన కేసు పెట్టి తమ అభిప్రాయం ఏంటి అంటూ అడగడం ఏంటని ప్రశ్నించారు?. అసలు ఈ కేసు విచారణ ఈ ఏడాది జూన్ లోనే ముగిసిందని సిబిఐ ఒక సీల్డ్ కవర్ ద్వారా నివేదికను హైకోర్టుకు ఇచ్చింది.. ఈ రిపోర్ట్ కాపీలు అసలు చూడకుండనే ఈ కేసు గురించి అభిప్రాయం చెప్పాలంటే ఎలా అని ప్రశ్నించింది? ఆయేషా తల్లి. సిబిఐ కూడా మా బిడ్డకు ఎలాంటి న్యాయం చేయలేకపోతోంది అంటూ మాట్లాడుతోంది ఆయేషా తల్లి.


మా మత సాంప్రదాయాలను పక్కనపెట్టి మరి ఆయేషా రీపోస్టుమార్టంకి తాము సహకరించామని.. ఈ కేసు విషయంపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి, డీజీపీ కూడా స్పందించాలంటూ షంషాద్ తెలియజేసింది. ఈ కేసుకు సంబంధించి నివేదికను తమకు ఇవ్వాలని ఆదేశం మీద తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించినప్పటికీ వారు మాత్రం దిగువ కోర్టులో తేల్చుకోవాలని సూచించారు..అయితే హైకోర్టు మేరకు విజయవాడలోని సిబిఐ న్యాయస్థానంలో పిటిషన్ వేసిన వీరికి ఇంతవరకు ఎలాంటి నివేదికలు అందలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: