దేవీ నవరాత్రులు ఈరోజు నుంచి మొదలు. దీంతో దేశవ్యాప్తంగా హిందువులు ఎంతో భక్తితో దుర్గాదేవి మాత పూజలు ప్రారంభించారు. ప్రతి ఏడాది కూడా అశ్వయుజ మాసంలో శుక్లపక్ష పాడ్యమి రోజునే శరన్నవరాత్రులు మొదలవుతాయి. అలా పాడ్యమి నుంచి దశమి వరకు ప్రతిరోజు కూడా అమ్మవారిని ప్రత్యేకించి మరీ పూజిస్తే పట్టిందల్లా బంగారంగా మారుతుంది అని పండితులు చెబుతున్నారు. ఒక్కో రోజు ఒక్కో అవతారం ధరించే అమ్మవారిని.. ఆయా అవతారంలో అలంకరించి పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయట. మరి పూజ ఎలా చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం.


నవరాత్రులలో మొదటి రోజు నుంచే అమ్మవారికి ప్రత్యేకించి పూజ చేయాలి. ప్రతిరోజు ఉదయం లేవగానే తల స్నానం చేసి, సుబ్రమైన దుస్తులు ధరించి అమ్మవారి విగ్రహాన్ని ప్రత్యేకమైన పూలతో అలంకరించి పూజ చేయడం మంచిది. అయితే ఈ పూజలో ఎరుపు రంగు గులాబీ పూలను వాడడం మంచిదని పండితులు సైతం తెలియజేస్తున్నారు. అమ్మవారికి ఆవు నెయ్యితోనే దీపం వెలిగించడం వల్ల మరింత అనుగ్రహం లభిస్తుందట.  నవరాత్రులలో మొదటి రోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనం ఇస్తారు. కనుక అలా అలంకరణలో అలంకరించడం మంచిది.


గులాబీ రంగు చీరలో అమ్మవారిని అలంకరించి పూజించడం వల్ల ఆ మాత అనుగ్రహం పొందవచ్చు. అమ్మవారిని భక్తితో పూజించి ఆమెకు ఇష్టమైన పాయసాన్ని నైవేద్యంగా ఉంచితే దుర్గాదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. దుర్గాదేవికి కుంకుమతో పూజ చేసి హారతి ఇచ్చి ఇంటిల్లిపాది ఆశీర్వాదం తీసుకోవడం వల్ల ఆ ఇంట్లో సుఖసంతోషాలతో పాటు ఐశ్వర్యాలు పెరుగుతాయని పండితులు సైతం తెలియజేస్తున్నారు. తొమ్మిది రోజులపాటు ఒక్కో అలంకారంలో పూజలు నిర్వహించాలి.

1). బాల త్రిపుర సుందరి దేవి అలంకరణ
2). గాయత్రీ దేవి అవతారం
3). అన్నపూర్ణాదేవి అవతారం
4). కాత్యాయనీ దేవి అవతారం
5). మహాలక్ష్మి దేవి అవతారం
6). లలితా దేవి అవతారం
7). చండీ దేవి అవతారం
8). సరస్వతి దేవి అవతారం
9). దుర్గాదేవి అవతారం.

మరింత సమాచారం తెలుసుకోండి: