మాజీ సీఎం వై ఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా అయిన కడపలో మేయర్ ఎన్నికలు నిర్వహించాలని ఇటీవల హైకోర్టు ఉత్తర్లను కూడా జారీ చేసింది. కడప మాజీ మేయర్ సురేష్ బాబను ప్రభుత్వం తొలగించడంతో హైకోర్టుని ఆశ్రయించగా హైకోర్టు మేయర్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.అయితే ఎట్టకేలకు ఈరోజు (గురువారం) మేయర్ అభ్యర్థిని ఎంచుకున్నారు. కోర్టు తీర్పుతో ఎన్నిక అనివార్యం కావడంతో నిర్వహించారు. కేఎంసీ కార్యాలయానికి 200 మీటర్ల వరకు 144 సెక్షన్ ని విధించారు. ఈరోజు ఉదయం 11 గంటలకు జేసి ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు జరిగాయి.


కడప నగర మేయర్  ఎన్నికలలో టిడిపి తరఫున అభ్యర్థి బరిలోకి నిలవడం లేదంటూ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. దీంతో వైసిపి అభ్యర్థి మేయర్గా ఎంపిక అయ్యారు. వైసిపి కార్పొరేటర్లలో 47 డివిజన్ కార్పొరేటర్ పాక సురేష్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నిక అనంతరం మేయర్గా ఆయన ప్రమాణస్వీకారం కూడా చేశారు. కడప కార్పొరేషన్ పాలకమండలిలో 50 మంది కార్పొరేటర్లు ఉండగా ఇందులో బోళా పద్మావతి, ఆనంద్ మృతి చెందారు.



జి ఉమాదేవి టిడిపి పార్టీ నుంచి గెలిచారు. మిగిలిన 47 మంది వైసీపీ కార్పొరేటర్లలో 8 మంది కార్పొరేటర్లు వైసీపీ నుంచి టిడిపి పార్టీలోకి చేరారు. దీంతో ప్రస్తుత వైసిపి కార్పొరేటర్ల సంఖ్య 39కి చేరింది. వీరందరూ కూడా కడప నగర కార్పొరేటర్గా పాకా సురేష్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే మేయర్ పదవి ఆశించి బంగ పడిన 10వ డివిజన్ కార్పొరేటర్ మల్లికార్జున మాత్రం ఈ ఎన్నికకు గైహాజరైనట్లుగా సమాచారం. టిడిపి పార్టీ ఎత్తుగడలను సైతం వైసీపీ పార్టీ ముందుగానే పసిగట్టి, ఎలాగైనా కార్పొరేషన్ పాలకమండలి చేజారకూడదని తగు జాగ్రత్తలు తీసుకొని సక్సెస్ అయ్యారు.ఇక కళ్యాణ్ దుర్గం మున్సిపల్ చైర్మన్ పదవి టిడిపి పార్టీ కైవసం చేసుకున్నట్లు తెలుస్తోంది. అక్కడ చైర్ పర్సన్ గా తలారి గౌతమి ఎన్నికయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: