భారతీయ హిందూ సాంప్రదాయం ప్రకారం భారతదేశంలో ఉన్న ఎన్నో గుళ్ళు ఎన్నో ప్రసిద్ధి కట్టడాలకు ప్రతీకలు. భారతదేశంలో అడుగడుగునా ఎన్నో దేవాలయాలు. ఇవన్నీ ఒక ఎత్తయితే ఈ ప్రపంచం లోనే ఏక రాతితో చెక్కిన అతిపెద్ద పురాతన ఆలయం గా అద్భుతమైన వాస్తు నిర్మాణం గా పేరుపొందిన ఎల్లోరా కైలాస దేవాలయం మాత్రం ఒక ఎత్తు.. ఈ దేవాలయం రహస్యం అటు చరిత్రకారులకు ఇటు శాస్త్రవేత్తలకు అంతుపట్టని రహస్యం గానే మిగిలిపోయింది.


ఈ కైలాస దేవాలయం సహ్యాద్రి పర్వతశ్రేణిలోని చరణాద్రి కొండల్లో..ఎల్లోరాలోని 16వ గుహలోని ఏకశిలా నిర్మాణమే ఈ కైలాస దేవాలయం. అయితే ఈ ఆలయాన్ని ఎప్పుడు..?ఎవరు..? ఎలా నిర్మించారనే విషయం పట్ల ఇప్పటికీ స్పష్టత లేదు. కొన్ని వందల సంవత్సరాల కాలం కిందట  నిర్మించారని కొందరంటే,కాదు కొన్ని వేల సంవత్సరాల క్రితమే నిర్మించి ఉంటారనీ తరవాతి కాలంలో మార్పులు చేసి ఉంటారనీ ప్రతి ఒక్కరూ భావిస్తున్నారే తప్ప సరైన ఆధారం ఒక్కటి కూడా లేదు..


ఇకపోతే ఇటీవల లభించిన కొన్ని ఆధారాల ప్రకారం- క్రీ.శ. ఎనిమిదో శతాబ్దంలో కృష్ణ-1 అనే రాష్ట్రకూట చక్రవర్తి ఈ దేవాలయాన్ని పునర్నిర్మించినట్లు తెలుస్తోంది. కానీ కృష్ణ యాజ్ఞవల్కి రచించిన 'కథా కల్పతరు' అనే గ్రంథం ప్రకారం చూసుకుంటే.. ఆ ప్రాంతాన్ని పాలించే 'ఎలు' అనే ఒక రాజు ఓసారి తీవ్రమైన అస్వస్థతకి గురవగా, భర్త కోలుకుంటే శివుడికి గుడి కట్టిస్తాననీ..ఆ  శిఖరాన్ని చూసేవరకూ ఉపవాసం చేస్తాననీ రాణి మొక్కుకుందట.


ఇక రాణి కోరుకున్నట్లే రాజు గారికి ఆ వ్యాధి తగ్గింది. దాంతో ఆ నిర్మాణాన్ని తక్షణం ప్రారంభించాలని అకున్నారట. కానీ శిఖర నిర్మాణానికి చాలా సంవత్సరాలు  పడుతుందని నిపుణులు చెప్పారట.ఇక వెంటనే  పైథాన్‌ నగరం నుంచి వచ్చిన కోకస అనే ఒక  వాస్తుశిల్పి, పర్వతం పై నుంచి కిందకి చెక్కుతూ వస్తే  కొద్ది రోజుల్లోనే శిఖరాన్ని నిర్మించవచ్చు అని తెలిపి, అలాగే చేశారు.. దాంతో రాణి ఉపవాస దీక్షను విరమించిందనీ అక్కడి పురాణాలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: