జట్టులో ఎంతో మంది స్టార్ ప్లేయర్స్ ఉన్నప్పటికీ..  ఇక అటు కెప్టెన్ కూడా ఎంతో సమర్ధుడు అయినప్పటికీ  ఎన్నో ఏళ్ల నుంచి అసలు టైటిల్ గెలవలేకపోయింది..  అని ఒక అపఖ్యాతిని మూటగట్టుకుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. అయితే ప్రస్తుతం ఐపీఎల్ లో అత్యధిక ఫాలోయింగ్ కలిగిన జట్టు గా కొనసాగుతున్నప్పటికీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మాత్రం ఇప్పుడు వరకు కనీసం టైటిల్ ని టచ్ చేయలేకపోయింది.  ప్రతి సీజన్లో కూడా భారీ అంచనాల మధ్య బరిలోకి దిగడం ఆ తర్వాత మాత్రం ఇక పేలవ ప్రదర్శనతో అందరిని నిరాశ పరచడం లాంటివి చేస్తూ ఉంటుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు.



 కానీ ఈ సారి మాత్రం ఇక మొదటి మ్యాచ్ నుంచి కూడా రికార్డుల మోత మోగిస్తూ వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోతుంది ఇప్పటివరకు నాలుగు మ్యాచ్ లు ఆడిన బెంగళూరు జట్టు నాలుగు మ్యాచ్ లలో కూడా విజయం సాధించింది. జట్టు అన్ని విభాగాల్లో కూడా అద్భుతంగా రాణిస్తూ ఉండడంతో ప్రస్తుతం వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్లో కొనసాగుతుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. కోహ్లీ సేన దూకుడు చూస్తూ ఉంటే ఈ సారి టైటిల్ని గెలవడం ఖాయం అనే విధంగానే కనిపిస్తోంది.


 మునుపెన్నడూ కనిపించని జోరు ప్రస్తుతం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు లో కనిపిస్తుంది అయితే ఇక ఇటీవల పంజాబ్ కింగ్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్లో అద్భుతంగా రాణించిన బెంగళూరు జట్టు ఒక్క వికెట్ కూడా పడకుండానే టార్గెట్ చేదించి ఘన విజయాన్ని అందుకుంది.  ఇక ప్రస్తుతం రికార్డుల మోత మోగిస్తోంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు.ఎక్కువసార్లు పది వికెట్ల తేడాతో గెలిచిన జట్టుగా ఘనత సాధించింది బెంగళూరు జట్టు. ఇప్పటి వరకు నాలుగు సార్లు 10 వికెట్ల తేడాతో గెలిచింది అత్యధిక సెంచరీలు చేసిన జట్టుగా కూడా రికార్డు సృష్టించింది. ఐపీఎల్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఏకంగా బెంగళూరు జట్టు 14 సెంచరీలు కొట్టగా ఇక తర్వాత స్థానంలో పంజాబ్ కింగ్స్ 13 సెంచరీలతో రెండవ స్థానంలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: