
కానీ ఎన్ని విధాలుగా ప్రయత్నించినప్పటికీ అటుపటిష్టమైన ఇంగ్లాండును మాత్రం టీమిండియా మహిళల జట్టు ఓడించలేకపోయింది అని చెప్పాలి. ఇకపోతే ఇప్పుడు మహిళల టీ20 ప్రపంచ కప్ లో భారత జట్టుకు కీలకమైన పోరుకు రంగం సిద్ధమైంది. నేడు ఐర్లాండ్ ను ఢీకొట్టబోతుంది హార్మన్ ప్రీత్ కౌర్ సేన. అయితే ఈ మ్యాచ్ లో గెలిచిందంటే చాలు భారత జట్టు ఎలాంటి సమీకరణలతో సంబంధం లేకుండా సెమీఫైనల్ లో అడుగుపెడుతుంది అని చెప్పాలి. మూడు మ్యాచ్ లలో రెండు విజయాలతో నాలుగు పాయింట్లు సాధించి రెండవ స్థానంలో ఉంది. అగ్రస్థానంలో ఉన్న ఇంగ్లాండ్ 3 మ్యాచ్లో విజయం సాధించి ఆరు పాయింట్ల తో సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. మరి ఈ కీలకమైన టీమిండియా ఎలా రాణిస్తుందో చూడాలి మరి.
అయితే ప్రస్తుతం వరుస విజయాలు సాధించి పటిష్టంగా కనిపిస్తున్న టీమిండియా. పసి కూనా టీం అయినా ఐర్లాండ్ పై విజయం సాధించడం పెద్ద విషయం కాదు అని క్రికెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు అని చెప్పాలి. అదే సమయంలో ఇక పసికూన అని తక్కువ అంచనా వేసి బరిలోకి దిగితే.. పటిష్టమైన జట్లు సైతం బంగబడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రతి మ్యాచ్ ను కూడా కీలకంగా భావించి ఐర్లాండ్తో 100% ఎఫర్ట్ పెడితేనే టీమ్ ఇండియా ఘన విజయాన్ని సాధించి మంచి రన్ రేట్ సాధించే అవకాశం ఉంది అని చెప్పాలి.