510 కిలోల 'విశ్వ' నీలమణి!
2021లో శ్రీలంకలో జరిగిన ఈ అద్భుత ఘటనకు సంబంధించిన వార్త ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది. సగం బావి తవ్వగానే కూలీకి మట్టిలో మెరుస్తున్న ఒక భారీ వస్తువు కనిపించింది. అదేదో రాయి అనుకోకుండా, అనుమానం వచ్చి వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చాడు. అధికారులు దాన్ని పరిశీలించి, చూసి షాక్ అయ్యారు! అది సాధారణ రాయి కాదు... ప్రపంచంలోనే అతిపెద్ద 'నీలమణి' (Sapphire Stone) రాయి!దాని బరువు వింటే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. ఈ భారీ నీలమణి బరువు ఏకంగా 2.5 మిలియన్ క్యారెట్లు లేదా దాదాపు 510 కిలోలు! శాస్త్రవేత్తలు, అంతర్జాతీయ నిపుణులు ఈ రాతి విలువను కనీసం US$100 మిలియన్లు (భారత కరెన్సీలో సుమారు ₹890 కోట్లు) ఉంటుందని అంచనా వేశారు. ఈ ధర 7 బిలియన్ల డాలర్ల వరకు కూడా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. రాత్రికి రాత్రే ఆ సామాన్య కూలీ జీవితం ఇలా మారిపోయింది!
కాంతి సోకితే... ఆరు కిరణాల నక్షత్రం!
ఈ నీలమణి రాయికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద నక్షత్ర నీలమణి (Star Sapphire) అని గుర్తించారు. కాంతి ఈ రాయిపై పడినప్పుడు, అది ఆరు కిరణాల నక్షత్రంలా మెరిసిపోతుంది! ఈ రాయి రెండు వైపులా నక్షత్రం వంటి ఆకారాన్ని కలిగి ఉండటం కూడా అత్యంత అరుదైన అంశం. ఇలాంటి అద్భుతమైన రాయి దొరకడం శ్రీలంకకు, ఆ కూలీకి ఒక జాక్ పాట్ తగిలినట్లే!ఈ ఘటన నాలుగేళ్ల క్రితం జరిగినా, ఇలాంటి అదృష్ట దేవత తలుపు తట్టిన కథలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. అందుకే ఈ వార్త మరోసారి సోషల్ మీడియాలో వైరల్ సునామీ సృష్టిస్తోంది. శ్రమకు దక్కిన అదృష్టం అంటే ఇదే!

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి