ఆ ఒక్క నిర్ణయం.. మూడు కోట్ల విజయం!
"కూతురి కోసం ఏదైనా చేయాలి" అన్న కసితో, చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో.. మహేశ్వరి ధైర్యం చేసింది. తన దగ్గర ఉన్న చిన్న చెవిపోగులు తాకట్టు పెట్టింది! అలా వచ్చిన ₹2000 రూపాయలతో ఏకంగా నాలుగు లాటరీ టికెట్లు కొనుగోలు చేసింది. జనవరి 17న కూతురి బర్త్డే రోజున తీసుకున్న ఆ టికెట్లు.. నవంబరు 22న ఆమె జీవితాన్నే మార్చేశాయి. ఆ రోజు సాయంత్రం.. ఆమె కొన్న టికెట్లకు రూ.3 కోట్లు బహుమతి తగిలిందని తెలిసి.. ఆ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది!
డాక్టర్ కావాలన్న కూతురు కల.. నెరవేరుతుంది!
ఈ ఊహించని విజయాన్ని నమ్మడానికి మహేశ్వరికి కొంత సమయం పట్టింది. కళ్లలో నీళ్లు తిరుగుతుండగా.. ఆమె మాట్లాడుతూ.. "నేను నమ్మలేకపోయాను. జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డానో ఆ దేవుడికే తెలుసు. ఇప్పుడు ఈ డబ్బుతో.. నా కూతురిని బాగా చదివించి, ఆమె డాక్టర్ కావాలన్న కలను కచ్చితంగా నెరవేరుస్తా!" అని ఉద్వేగంగా చెప్పింది.ఆ ఒక్కరోజు రాత్రి.. కటిక పేదరికం నుంచి కోటీశ్వరురాలిగా మారిన మహేశ్వరి సాహ్ని కథ.. కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ ఆశాదీపం. నిజాయితీగా కష్టపడేవారికి, కన్నీళ్లు పెట్టుకున్న వారికి దైవం ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రూపంలో అదృష్టాన్ని అందిస్తాడని ఈ కథ నిరూపించింది. లక్ష్యం ఉన్నచోట లక్ష్మి తప్పకుండా ఉంటుంది!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి