ఆంధ్రప్రదేశ్ లో అమరావతి ఉద్యమం మీడియాలో బాగా హైలెట్ కాకపోయినా సరే అక్కడ మాత్రం కాస్త ఉద్యమం ముందుకు వెళ్తుంది. రాజకీయంగా రెండేళ్ళ నుంచి ఈ అమరావతి ఉద్యమం అనేది కాస్త హాట్ టాపిక్ అయినా సరే దాని వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. ఇక ఇదిలా ఉంటే అమరావతి రైతుల న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర కు అనుమతి పై ఈనెల 28వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

ఈ మేరకు రాష్ట్ర డీజీపీ కి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిర్ణయానికి సంబంధించిన సమాచారాన్ని హైకోర్టు కి పంపాలని ఆదేశాలు ఇచ్చింది. పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని ఇప్పటికే డీజీపీకి వినతిపత్రం ఇచ్చామని హైకోర్టుకు న్యాయవాది వి.వి లక్ష్మీనారాయణ వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap