ఏపీ సీఎం జగన్ అసెంబ్లీ రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అమరావతి రైతుల పాదయాత్ర మళ్లీ ప్రారంభం కానున్న నేపథ్యంలో  ఆ పార్టీ నేత చింతమనేని ప్రభాకర్ దీనిపై స్పందించారు. మూడు రాజధానులు అయ్యే పని కాదంటున్న చింతమనేని ప్రభాకర్.. జగన్ కు ధైర్యం ఉంటే అసెంబ్లీ రద్దు చేసి అమరావతి అంశంపై ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు.


అమరావతి రైతుల పాదయాత్రను టీడీపీ నడిపిస్తుందనటంలో అర్థం లేదంటున్న చింతమనేని ప్రభాకర్.. మేం నడిపిస్తే మా పార్టీ మొత్తం ఇక్కడే ఉండేదని వ్యాఖ్యానించారు. రాజధాని పనులు ఆపేసి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకున్నారన్న చింతమనేని ప్రభాకర్.. భూములు ఇచ్చిన రైతులను అన్యాయం చేశారన్నారు. వైసీపీ నేతలు ఎక్కడైనా గజం స్థలం ఇవ్వగలరా అని చింతమనేని ప్రభాకర్ ప్రశ్నించారు. అమరావతి రైతుల పాదయాత్రను ఒక్క వైసీపీ మాత్రమే వ్యతిరేకిస్తుందన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: