టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబం కరోనా కుటుంబం అంటూ వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టులో కేసులు వేసుకుంటూ చంద్రబాబు బ్రతికేస్తున్నారని ఆయన మండిపడ్డారు. జగన్కు మంచి పేరు రాకుండా అడ్డుకోవాలని అనునిత్యం ప్రయత్నిస్తున్నారని ఈ సందర్భంగా అమరనాథ్ ఆరోపణలు చేసారు. మూడు నెలలుగా చంద్రబాబు జూమ్ యాప్లో తప్ప ఎక్కడా కనిపించడం లేదని అమరనాథ్ ఎద్దేవా చేయడ౦ గమనార్హం.
చంద్రబాబుకు మార్కెటింగ్, మేనేజింగ్, పబ్లిసిటీ తప్ప ఏమీ తెలియదని, ప్రభుత్వంపై నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు మీద చర్యలు తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేసారు. మూడు పార్టీలతో పోరాటం చేసి తాము భారీ విజయం సాధించామని ఆయన గుర్తు చేసారు.