మహారాష్ట్రలో కరోనా చుక్కలు చూపిస్తుంది. రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి గాని తగ్గడం లేదు. దేశంలో కరోనా కేసుల్లో 35 శాతం అక్కడే నమోదు అవుతున్నాయి. ఈ రోజు కొత్తగా  3041 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. 58 మరణాలు నమోదయ్యాయి. 

 

మొత్తం కేసుల సంఖ్య 50231 గా ఉంది. వీటిలో 33988 క్రియాశీల కేసులు. మరణాల సంఖ్య 1635 గా ఉంది. ఈ రోజు మొత్తం 1196 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు, ఈ రోజు వరకు 14600 మంది రోగులు డిశ్చార్జ్ అయ్యారని మహారాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అత్యధికంగా ముంబై లో కరోనా కేసులు నమోదు అయ్యాయి. మరణాలు కూడా అక్కడే ఎక్కువగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: