పాలకుడు అంటే ప్రజల మనిషి.. ప్రజల హృదయాలను గెల్చుకునే మనిషి.. అలాంటి మనుషులు చాలా అరుదుగా ఉంటారు.. అందుకే వాళ్లు చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోతారు. అలాంటి గొప్ప నాయకులు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. ఆయన కడుపున పుట్టిన బిడ్డ సీఎం జగన్ మోహన్ రెడ్డి తండ్రి బాటలో నడుస్తూ ప్రజా సేవ చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు.  ఏడాది పాలన సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డికి మంత్రి బొత్స సత్యనారాయణ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు నివాళులు అర్పించారు.

 

ఈ కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్‌రావుతోపాటు ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జోగి రమేష్‌లు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ... ఈ ఏడాది కాలంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు.  ఆదర్శ పాలనకు కేరాఫ్ అడ్రస్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రాజశేఖర్‌రెడ్డి అందించిన సంక్షేమ పాలనను మించి ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సుపరిపాలన అందిస్తున్నాడన్నారు.  ప్రజలు ఎలాంటి నాయకుడు కావాలనుకున్నారో.. వారికి సీఎం జగన్ రూపంలో లభించారని అన్నారు బొత్స. 

మరింత సమాచారం తెలుసుకోండి: