ఏపీ సర్కార్ ని టార్గెట్ గా చేసుకుని టీడీపీ అనుకూల మీడియా కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది. దీనిపై వైసీపీ కాస్త సీరియస్ గానే ఉండటం వైసీపీ నేతలు పదే పదే టీడీపీ నేతలను టార్గెట్ చేసి విమర్శలు చేయడం వంటివి మనం చూస్తూనే ఉంటాం. రాజకీయంగా ఈ మీడియా వ్యవహారం కాస్త ఎప్పుడు కూడా హాట్ హాట్ గానే ఉంటూ ఉంటుంది అనే విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేసారు.

“ఈర్శ, ద్వేషాలతో రగిలి పోయేవారు ఎవర్నైనా అప్రతిష్ట పాల్జేయాలంటే ఒకప్పుడు ఆకాశరామన్న పేరుతో కరపత్రాలు వేయించి వదిలేవారు. కొందరు నిజమేనని నమ్మే పరిస్థితి ఉండేది. ఇప్పుడంత అజ్ఞానం ఎవరికీ లేదు. అయినా, ఎల్లో మీడియా 40-50 ఏళ్ల క్రితం నాటి కరపత్రాల టెక్నిక్ నే నమ్ముకుంది ఇప్పటికీ.” అని ఆయన ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

mp