దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు సడలింపులు చేస్తున్నాయి. ఇక మరికొన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ ను పూర్తిగా ఎత్తి వేస్తున్నాయి. తెలంగాణలోనూ లాక్ డౌన్ ను పూర్తిగా తీసివేశారు. దాంతో విద్యా సంస్థలు సైతం ప్రారంభిస్తున్నట్టు తెలంగాణ సర్కార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. నేటి నుండి ఉపాధ్యాయులు, లెక్చరర్లు స్కూళ్లు, కాలేజీలకు వెళ్లనున్నారు. ఇక తాజాగా పరీక్షల షెడ్యూల్ ను సైతం హైదరాబాద్ జేఎన్టీయు విడుదల చేసింది. ఫైనల్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ పరీక్షలను జులై 5 నుండి 14 వరకు నిర్వహిస్తామని ప్రకటించింది.

అంతేకాకుండా మార్చ్ నెలలో వాయిదాపడిన బీటెక్ మూడవ సంవత్సరం, నాలుగవ సంవత్సరం విద్యార్థుల మొదటి సెమిస్టర్, బి ఫార్మసీ ఫోర్త్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలను జూలై 13 వ తేదీన నిర్వహించనున్నారు. అంతేకాకుండా మార్చిలో నిర్వహించిన పరీక్షల సందర్భంగా ఇచ్చిన హాల్ టికెట్స్ మరియు ఎగ్జామ్ సెంటర్ లలోనే పరీక్షలు రాయవచ్చని ప్రకటించింది. ఇక ఇంతకాలం పుస్తకాలకు దూరమైన విద్యార్థులు జేఎన్ టీయూ ప్రకటనతో మళ్లీ పుస్తకాల దుమ్ముదులిపే సమయం వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: