రాజస్థాన్‌లో అత్యాచారానికి పాల్పడ బోయిన నిందితుడిని తాడుతో కట్టి, కొట్టారు. అంతే కాదు, ఈ యువకుడి చేత బలవంతంగా మూత్రం కూడా తాగించారు. రాజస్థాన్ లోని కోటలో ఈ ఘటన జరిగింది. 22 ఏళ్ల యువకుడికి సంబందించిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది, ఇప్పుడు ఈ విషయంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటన సెప్టెంబర్ 14 న జరిగిందని చెబుతున్నారు. రెండు రోజుల తర్వాత, యువకుడి దూరపు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ యువకుడు బలవంతంగా తమ ఇంట్లోకి ప్రవేశించి తమ కోడలి మీద అత్యాచారానికి పాల్పడ్డాడని యువకుడి మేనమామ మరియు అత్త పేర్కొన్నారు. పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు, అయితే అత్యాచారానికి పాల్పడిన యువకుడి అన్నయ్య ఈ కేసులో పోలీసులకు వేరే కథ చెప్పాడు. కోటా జిల్లా జగ్‌పురా గ్రామంలో నివసిస్తున్న అతని బంధువులు సెప్టెంబర్ 14 న తన సోదరుడిని ఇంటికి పిలిచినట్లు యువకుడి సోదరుడు చెప్పాడు. బంధువులు ఆ యువకుడి చేతులు, కాళ్లు కట్టేసి, ఆ తర్వాత రాత్రంతా కట్టి ఉంచారని ఆరోపించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: