అస్సాంలో సుమారు 4.19 లక్షల పెట్టీ క్రైం కేసులు ఉన్నాయి. వీటిలో మూడు లక్షల కేసులు ఉపసంహరించుకోవాలని అస్సాం నిర్ణయించింది. గతేడాది జైళ్ల నిర్వహణ కోసం అస్సాం రూ. 160 కోట్లు వెచ్చించింది. తాజా నిర్ణయంతో పెట్టీ కేసుల్లో శిక్షపడిన వారిపై ఖర్చులు తగ్గనున్నాయి. చిన్నచిన్న తగవులు, కొట్లాటలు, ఉల్లంఘనలపైనా పోలీసులు పెట్టీ కేసులు నమోదు చేస్తుంటారు. ఇలాంటి కేసులు కోర్టులపై అనవసర భారంగా మారుతున్నాయి. దీనివల్ల అత్యవసర కేసుల విచారణ ఆలస్యమవుతోంది.
అస్సాంలో సుమారు 4.19 లక్షల పెట్టీ క్రైం కేసులు ఉన్నాయి. వీటిలో మూడు లక్షల కేసులు ఉపసంహరించుకోవాలని అస్సాం నిర్ణయించింది. గతేడాది జైళ్ల నిర్వహణ కోసం అస్సాం రూ. 160 కోట్లు వెచ్చించింది. తాజా నిర్ణయంతో పెట్టీ కేసుల్లో శిక్షపడిన వారిపై ఖర్చులు తగ్గనున్నాయి. చిన్నచిన్న తగవులు, కొట్లాటలు, ఉల్లంఘనలపైనా పోలీసులు పెట్టీ కేసులు నమోదు చేస్తుంటారు. ఇలాంటి కేసులు కోర్టులపై అనవసర భారంగా మారుతున్నాయి. దీనివల్ల అత్యవసర కేసుల విచారణ ఆలస్యమవుతోంది.