తెలంగాణకు గుడ్ న్యూస్‌ వచ్చింది. పెన్ గంగపై నదిపై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఛనాకా - కొరాటా అనకట్టకు పర్యావరణ అనుమతులు వచ్చేశాయి. ఈ ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ అనుమతులు మంజూరు చేసింది. 2016లో జరిగిన ఒప్పందం ప్రకారం తెలంగాణ, మహారాష్ట్ర సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టగా.. తెలంగాణలోని 5463 హెక్టార్లకు, మహారాష్ట్రలోని 1214 హెక్టార్లకు ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందే అవకాశం ఉంది. ఇందుకోసం పెన్ గంగ నదిపై లోయర్ పెన్ గంగ దిగువన 23 గేట్లతో 0.8 టీఎంసీల సామర్థ్యంతో ఆనకట్ట నిర్మిస్తారు.


ఛనాకా - కొరాటా ఆనకట్ట ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 13వేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంది. ఆనకట్ట నుంచి లోయర్ పెన్ గంగ కాల్వలకు మరో 47వేల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంది.  మొత్తంగా ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, తాంసీ, బేలా మండలాల్లోని యాభై వేల ఎకరాలకు పైగా సాగునీరు ఈ ప్రాజెక్టు ద్వారా  అందనుంది. తెలంగాణ రాష్ట్రం వైపు ఆనకట్ట నిర్మాణానికి సంబంధించిన పనులకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ అనుమతులు ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: