ప్రధాని నరేంద్ర మోదీ షాకింగ్ కామెంట్స్ చేశారు. పాకిస్తాన్, భారత్ మధ్య జరిగిన దాడుల నేపథ్యంలో ప్రధాని మోదీ నేడు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ క్రమంలో మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ ఆర్మీ పాకిస్తాన్ పై మూడు రోజులపాటు దాడి చేసిందని చెప్పారు. కేవలం మూడు రోజుల్లోనే పాకిస్తాన్ కి ముచ్చెమటలు పట్టాయని హేళన చేశారు. దాడులకు భయపడిన పాకిస్తాన్ DGMOతో కాళ్ల బేరనికి వచ్చిందని చెప్పారు. భారత్ ప్రజల, విద్యాసంస్థల, ఆర్మీ క్యాంపులపై దాడులు చేసేందుకు పాకిస్తాన్ దుస్సాహసం చేసిందని అన్నారు. పాకిస్తాన్ దాడులను భారత్ కనివిని ఎరుగని రీతిలో తిప్పి కొట్టిందని మోదీ చెప్పుకొచ్చారు. భారత్ ఆర్మీ ఎదురుదాడితో పాకిస్తాన్ కంగుతిన్నదని ప్రధాని స్పష్టం చేశారు.

పహల్గాంలో జరిగిన దాడికి భారత్, పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకున్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై భారత్ దాడులకు దిగింది. కాశ్మీర్ పీవోకే లో పీఓకేలో ఉగ్ర‌శిభిరాల‌పై భారత్ మిస్సైల్ దాడులు నిర్వహించింది. ఈ దాడులను "ఆపరేషన్ సింధూర్" పేరుతో భారత్ ప్రభుత్వం మొదలుపెట్టింది. పాకిస్తాన్ లోని కోట్లీ, మురిడ్కే, బహవల్పూర్‌, ముజఫరాబాద్‌ తో పాటుగా 20కి పైగా ప్రాంతాల్లో భారత్ దాడులు నిర్వహించింది.

భారతదేశంలోని జమ్మూకాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ మరియు ఇతర సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్ దాడులు జరిపింది. దీంతో భారత్ వరుస దాడులతో పాకిస్థాన్ ని ముప్పు తిప్పలు పెట్టింది. భారత్ ఆర్మీ పాకిస్తాన్ టెర్రరిస్టులను ఒక్కొక్కరిగా కలుపు మొక్కలను ఏరిపారేసినట్టు ఏరిపారేసింది. భారత్ పాకిస్తాన్ కు చుక్కలు చూపిస్తోంది. భారత్ అన్నీ విధాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. పాకిస్థాన్ ఎన్నో విధాలుగా భారత్ ని ఓడించేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ.. ఫలితం లేకపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: