ఇటీవలి కాలంలో ఏకంగా సోషల్ మీడియా వేదికగా పరిచయమైన ఎంతోమంది అమ్మాయిలు అమాయకపు యువకులను బుట్టలో వేసుకుని పెళ్లి పేరుతో మోసగించి అందినకాడికి దోచుకుంటున్న సంఘటనలు తరచూ సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవలే పశ్చిమ బెంగాల్ లో కూడా ఇలాంటి తరహా ఘటన జరిగింది అని చెప్పాలి. పశ్చిమ బెంగాల్కు చెందిన అలోక్ అనే యువకుడికి ఒడిశాకు చెందిన మేఘన అనే యువతి పరిచయమైంది. ఫేస్బుక్ వేదికగా వీరిద్దరికీ పరిచయం కాగా 15 రోజుల్లోనే వీరి మధ్య ప్రేమ పుట్టింది. ఈ క్రమంలోనే పెళ్లితో ఒక్కటవ్వాలి అని అనుకున్నారు ఇద్దరు యువతీ యువకులు.
ఈ క్రమంలోనే పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడం కంటే పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడం ఉత్తమం అని భావించి చివరికి ఎంతో కష్టపడి పెద్దలను ఒప్పించారు. ఈనెల 24వ తేదీన జాజ్పూర్ లో వీరు పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత జరిగిన రిసెప్షన్ కు వచ్చిన ఒక అతిథి కారణంగా అసలు విషయం తెలిసి ఇక పెళ్ళికొడుకు ఒక్కసారిగా షాక్ లో మునిగి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెళ్లి కుమార్తెను మేఘనాథ్ అని పిలిచాడు. అతను మా బంధువే అంటూ చెప్పాడు పెళ్లికి వచ్చిన ఒక వ్యక్తి. దీంతో షాక్ అయినా వరుడి కుటుంబ సభ్యులుపైగా లేడి వేషం వేసుకున్న యువకుడిని చితకబాది పోలీసులకు అప్పగించారు..