ప్రేమ అనేది ఎన్నో మధురానుభూతుల సమ్మేళనం.. ఒకసారి ప్రేమలో పడిన తర్వాత ఇక యువతి యువకులు ఇద్దరు కూడా ఈ ప్రపంచాన్ని సైతం మర్చి పోతూ ఉంటారు అని ఆ ప్రేమ లో పడిన వారే చెబుతూ ఉంటారు. ప్రేమ లో పడిన తర్వాత ఆ అనుభూతిని మాటల్లో వర్ణించడం కూడా కష్టమే అని అంటూ ఉంటారు. అయితే నేటి రోజుల్లో ఇలాంటి ప్రేమలు కేవలం సినిమాల్లో మాత్రమే కనిపిస్తున్నాయ్. కానీ రియల్ లైఫ్ లో చూసుకుంటే ప్రేమ అనే ముసుగు వేసుకొని మోసం చేసేవాళ్లే తప్ప నిజాయితీగా ప్రేమించే వాళ్ళు నూటికో కోటికో ఒక్కరు మాత్రమే కనిపిస్తున్నారు అని చెప్పాలీ.


 నేటి రోజుల్లో ప్రేమ కారణం గా జరుగుతున్న దారుణాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా లవ్ అనేది ప్రాణాలు పోవడానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది అని చెప్పాలి. ప్రేమించిన వారు మోసం చేశారని కొంతమంది.. ప్రేమను గెలిపించుకోలేకపోయామని మరి కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇక పెద్దలను ఎదిరించి ప్రేమను గెలిపించుకుంటే చివరికి ఆ పెద్దలే పెళ్లి ప్రేమ పెళ్లి చేసుకున్న వారిని దారుణంగా పరువు హత్యలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఇలా ప్రేమించిన పాపానికి ఏదో ఒక విధంగా ప్రాణాలు పోతూనే ఉన్నాయి.



 అయితే ప్రేమ ఇక్కడ మరో ప్రాణాన్ని బలి తీసుకుంది. మంచిర్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమ విఫలం కావడంతో మామిడి గట్టుకు చెందిన నాంపల్లి సంగీత అనే 23 ఏళ్ల యువతి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అయితే ప్రియురాలు మరణ వార్త తెలుసుకున్న ప్రియుడు.. చిత్తాపూర్ వాసి 21 ఏళ్ల భగవాన్ కూడా పురుగుల మందు తాగి బలవన్మరణానికి  పాల్పడ్డాడు. ఇలా ఇద్దరు కూడా క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. తల్లిదండ్రుల కడుపు కోతకు కారణమైంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: