రాజకీయాల్లో ఉన్న వారికి ...రాజకీయ పార్టీలు నడిపించే వారికి మీడియా ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు మీడియా అంతా పార్టీలకు అనుకూలంగా కథనాలను ప్రచారం చేసేవే. మీడియా మేనేజ్మెంట్ చేయడంలో సిద్ధహస్తుడు గా పేరుపొందిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో తిరుగులేకుండా ఇప్పటికీ రాణించగలుగుతున్నారు అంటే దానికి కారణం ఆయనకు అనుకూలంగా మెజారిటీ మీడియా పని చేయడమే. అయితే మీడియా మేనేజ్మెంట్ విషయంలో ఏపీ సీఎం వైసీపీ అధినేత జగన్ ఘోరంగా విఫలం అయ్యారని చాలాకాలంగా విమర్శలు వస్తున్నాయి. జగన్ కు సొంతంగా 'సాక్షి' మీడియా ఉంది. అయితే సొంత మీడియా ఉన్నా, జగన్ ప్రచారంలో బాగా వెనుకబడి పోయాడు. దీనికి కారణం జగన్ సొంత మీడియా టీం పనితీరు అంతంత మాత్రంగానే ఉన్నట్లు వైసిపి నాయకులే ఒప్పుకుంటున్నారు. 

IHG


తాజాగా ఏపీ ఎన్నికల కమిషనర్ నియామకం విషయంలో జగన్ మీడియా కు చెందిన కొంతమంది పెద్ద స్థాయి వ్యక్తులు చేసిన తప్పటడుగులు జగన్ కు తలవంపులు తీసుకు వచ్చాయి. ఇప్పటికీ జగన్ ఆలోచనలు, నిర్ణయాలను అంచనా వేయడంలో జగన్ మీడియా టీం విఫలం అయినట్టుగా ప్రచారం జరుగుతోంది. వైసిపి ప్రతిపక్షంలో ఉన్న సమయం కంటే అధికారంలో ఉన్న సమయంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ అందరికీ షాక్ ఇస్తున్నారు. కానీ ఆయన సొంత మీడియా టీం మాత్రం దానికి అనుగుణంగా పనిచేయలేక జగన్ కు తలవంపులు తీసుకువచ్చే విధంగా తయారయ్యింది. తాజాగా వైసీపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ... టీడీపీకి అనుకూలంగా పని చేస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను ఆకస్మాత్తుగా తప్పించే  విధంగా జగన్ ప్రభుత్వం ఆగమేఘాల మీద చర్యలు తీసుకున్నారు. 

 

ప్రత్యేకంగా ఆర్డినెన్స్ తెచ్చి గవర్నర్ తో ఆమోదం పొందేలా చేసుకుని ఎన్నికల సంఘం నిబంధనలు మార్పు చేసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను పూర్తిగా తప్పించింది వైసీపీ ప్రభుత్వం. అంతేకాకుండా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా రిటైర్డ్ జడ్జి ఉండాలనే కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకువచ్చారు. అయితే ఈ సమయంలో జగన్ మీడియాలోని కొంతమంది వ్యక్తులు జగన్ కు క్రెడిట్ రాకుండా  వ్యవహరించడం పై జగన్ సైతం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. జగన్ నిర్ణయం ప్రకటించక ముందే సీనియర్ ఐఏఎస్ అధికారి రాంచందర్ రెడ్డి ని నియమిస్తున్నారు అంటూ జగన్ మీడియాలోని ప్రముఖ వ్యక్తులు కొందరు లీకులు ఇచ్చారు. దీంతో బిబిసి వంటి ప్రఖ్యాత మీడియా సంస్థలు కూడా జగన్ మీడియా లీకులను ఆధారంగా చేసుకుని  దానికి అనుగుణంగా కథనాలు ప్రచారం చేశారు.

 

 రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ని జగన్ ఎన్నికల అధికారి నియమించడంపై వైసిపి వ్యతిరేక మీడియాలో బాగా హైలెట్ అయ్యింది. అయితే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న జగన్ అసలు తన నిర్ణయం ఏమిటో తెలియక ముందే ఏ విధంగా లీకులు ఇచ్చారు అనే విషయంపై పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. తన నిర్ణయం  తెలియజేయకుండానే ముందుగా తనను అభాసుపాలు చేసేలా లీకులు ఇచ్చిన వ్యక్తి ఎవరు అనే విషయం పై జగన్ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి ఆరాతీస్తున్నారట. ప్రస్తుతం ఈ వ్యవహారం జగన్ మీడియాలోనూ, పార్టీలోనూ, తీవ్రస్థాయిలో చర్చగా మారింది. తనకంటూ సొంతంగా మీడియా ఉన్నా, మీడియా సలహాదారులు ఉన్నా జగన్ మాత్రం అదే మీడియా విషయంలో ప్రతి సందర్భంలోనూ, అభాసుపాలవుతూనే ఉన్నారు. సాక్షి విషయంలో జగన్ మరింత శ్రద్ధపెట్టాల్సిన అవసరం ఉందేమో కదా ! 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: