ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. లైఫ్ ఇన్య్సూరెన్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియాకి చెందిన గోల్డెన్ జూబ్లీ పౌండేష‌న్ 2020-21 విద్యా సంవ‌త్స‌రానికి ఆర్థికంగా వెనకబడ్డ పేద విద్యార్థులను ఆదుకోబోతుంది. వారి ఉన్న‌త చదువులు కోసం దేశ‌వ్యాప్తంగా స్కాల‌ర్‌షిప్లు ఇవ్వబోతున్నామంటూ ప్రకటన విడుదల చేశాయి. దేశ‌వ్యాప్తంగా ఎల్ఐసీ డివిజ‌న‌ల్ సెంట‌ర్  20 చొప్పున‌ అంటే బాలురకి 10 స్కాల‌ర్‌షిప్‌లు బాలికలకు 10 స్కాలర్ షిప్ లు ఇవ్వనుందట....ప్ర‌తి ఎల్ఐసీ డివిజ‌న్ ప‌రిధిలో కేవ‌లం 10వ తరగతి పూర్తి చేసిన బాలిక‌లకు 10 ప్ర‌త్యేక స్కాల‌ర్‌షిప్స్ ఇవ్వనుందని తెలిపింది.ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థిని విద్యార్థులకి  ఏటా రూ. 20,000 లను మూడు విడతలుగా చెల్లిస్తారు. స్పెషల్ గర్ల్ చైల్డ్ స్కీమ్ కింద ఎంపికైన విద్యార్థినులకు నెలకు రూ.10,000 చొప్పున రెండు సంవత్సరాలు ఇస్తారు. ఈ మొత్తాలను నేరుగా అభ్యర్థుల బ్యాంకు ఖాతాలకు పంపుతారు. ఇలా కోర్సు పూర్తయ్యే వరకు ఇస్తారు.

ఈ స్కాలర్ షిప్ కి కావాల్సిన అర్హతలు చూసుకున్నట్లయితే....10వ తరగతి , ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉంటే చాలు. ఎల్ఐసీ స్కాలర్‌షిప్‌న‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. సాంకేతిక, వృత్తివిద్యా కోర్సుల్లో చేరిన వారికీ ఈ సాయం అందుతుంది.2019-20 విద్యాసంవ‌త్స‌రంలో క‌నీసం 60% మార్కుల‌తో ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణులై ఉండాలి‌.ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణులైన విద్యార్థులు ప్ర‌భుత్వ గుర్తింపు పొందిన కాలేజీలు లేదా ఐటీఐ సంబంధిత కోర్సులు చ‌దువుతూ ఉండాలి.ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు మెడిసిన్‌, ఇంజినీరింగ్‌, గ్రాడ్యుయేష‌న్‌, ఇంటిగ్రేటెడ్ కోర్సులు, డిప్లొమా లేక త‌త్స‌మాన ఉన్న‌త విద్య‌ చ‌దువుతూ ఉండాలి.

కుటుంబ వార్షిక ఆదాయం రూ. లక్ష మించకూడదు.మెడికల్, ఇంజినీరింగ్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరిన విద్యార్థులు 55 శాతం మార్కులను, సాధారణ డిగ్రీ కోర్సుల్లో చేరిన వారు 50 శాతం మార్కులను పొందితేనే మరుసటి సంవత్సరానికి స్కాలర్ షిప్ కొనసాగుతుంది.ప్రతిరోజూ హాజరు  శాతాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు.ఇది డిసెంబర్ 31తేదీ లోగా  https://www.licindia.in/ అనే  ఆన్లైన్ లింక్ ద్వారా  దరఖాస్తు చేసుకోవాలి...


మరింత సమాచారం తెలుసుకోండి: