నిద్రలేమి వల్ల నష్టాలు? తీసుకోవాల్సిన జాగ్రత్తలు?నిద్ర తక్కువైతే ఎన్నో రోగాలు వస్తాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నిద్ర లేమి కారణంగా ఏకాగ్రత లోపించడంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అయితే తాజా అధ్యయనం ప్రకారం తగినంత నిద్ర లేకపోవడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని తేలింది.రోజులో కనీసం 7 నుంచి 9 గంటలు నిద్రపోవచ్చు. అయితే ఒక గంట అటు ఇటు పర్వాలేదు కాని.. బాగా తక్కువ సమయం పడుకుంటే మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని ఓ తాజా అధ్యయనం వెల్లడించింది. నిద్ర లేమి శరీరంలో జీవక్రియ మార్పులకు దారితీస్తుందని, ఫలితంగా గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుందని తేలింది. దీని వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని ఈఅధ్యయనం తెలిపింది.నిద్రకు తగిన సమయం కేటాయించాలి.ఒక రోజులో ఎంత సేపు పడుకోవాలో షెడ్యూల్ చేసుకోవాలి. మనం మేల్కొనే సమయం కూడా నిర్ణయించుకోవాలి. నిద్ర రావడంలేదంటూ కొన్ని సార్లు పడుకోము.
అలాకాకుండా మనం నిర్ణయించుకున్న సమయానికి పడుకోవాలి అలా కొద్ది రోజులు ప్రయత్నిస్తే ఆటైంకి పడుకోవడం అలవాటు అయిపోతుంది. నిద్రపోయేటప్పుడు ఎంత హాయిగా ఉంటున్నారనేది చూసుకోవాలి. సౌకర్యవంతమైన పరుపులు, దిండ్లు ఎంచుకోవాలి. గది ఉష్ణోగ్రత సమానంగా ఉండేలా చూసుకోవాలి. అవసరమైతే పడుకునే ముందు కొద్ది సేపు మంచి మెలోడీ సాంగ్స్ వినడం మంచిది. నిద్రలేమితో బాధపడుతున్నవారు కాఫీ, టీలు తాగడం తగ్గించాలి. ఇలా చేస్తే నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.వ్యక్తిగత లేదా పని సంబంధిత ఒత్తిడికి గురవడం నిద్రలేమికి కారణం కావచ్చు. మానసిక ఆరోగ్య నిపుణుడిని సంప్రదించడం వలన మీరు మీ మనస్సుపై ఒత్తిడి లేకుండా చూసుకోవచ్చు. నిద్రకు ముందు ఒత్తిడి లేకుండా ఎలా తగ్గించుకోవచ్చో పలు సూచనలు చేస్తారు. వైద్యులు సూచనల ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.ఇవి నిద్రలేమి వల్ల నష్టాలు. ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.కాబట్టి ఖచ్చితంగా పాటించండి. ఆరోగ్యంగా వుండండి.
మరింత సమాచారం తెలుసుకోండి: