మనం తినే ఆహారం ద్వారా మన శరీరంలోకి చాలా రకాల మలినాలు ప్రవేశిస్తాయి. అలాగే నూనె పదార్థాలు ఇంకా జంక్ ఫుడ్ తీసుకునే వారి శరీరంలోకి ఈ మలినాలు  మరింత ఎక్కువగా ప్రవేశిస్తాయి. ఇవి మన ప్రేగులకు అతుక్కుపోయి జీర్ణ వ్యవస్థ నెమ్మదించేలా చేస్తాయి.ఇంకా అలాగే శరీరంలో చెడు బ్యాక్టీరియా ఎక్కువగా పెరిగేలా చేస్తాయి.  జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకునే వారిలో కచ్చితంగా జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.ఇంకా అదే విధంగా ధూమపానం చేసే వారిలో కూడా శరీరంలో మలినాలు చాలా ఎక్కువగా ఉంటాయి.శరీరంలో మలినాలు ఎక్కువగా పేరుకుపోయిన వారు నీటిని బాగా తాగాలి. నీటిని ఎక్కువగా తాగడం వల్ల మలినాలు మూత్రం ఇంకా చెమట ద్వారా బయటకు పోతాయి. ఇంకా అలాగే మూత్రపిండాలు కూడా శుభ్రపడతాయి. రక్తంలో ఉండే మలినాలు ఈజీగా తొలగిపోతాయి. అలాగే రోజుకు 8 నుండి 10 గ్లాసుల నీటిని తప్పకుండా తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే మలినాలు చాలా సులవుగా తొలగిపోతాయి. అదే విధంగా వారానికి ఒకరోజు ఖచ్చితంగా ఉపవాసం చేయాలి.


ఇలా చేయడం వల్ల ప్రేగులు ఇంకా జీర్ణవ్యవస్థలో పేరుకుపోయిన మలినాలు తొలగిపోతాయి.ఇంకా అదే విధంగా ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల చాలా సులభంగా మనం శరీరంలో ఉండే మలినాలను తొలగించుకోవచ్చు. ఏదో ఒక వ్యాయామం చేయడం వల్ల శరీరంలో ఉండే వ్యర్థాలు చెమట ద్వారా ఈజీగా బయటకు పోతాయి.రోజుకు ఒక 20 నుండి 30 నిమిషాల పాటు ఎక్కువగా చెమట పట్టేలా ఏదో ఒక వ్యాయామం చేయాలి. అదే విధంగా రోజూ ఒక గ్లాస్ నిమ్మకాయ నీటిని ఖచ్చితంగా తాగాలి. ఎందుకంటే నిమ్మకాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో ఉండే వ్యర్థాలను బయటకు పంపించడంలో చాలా బాగా పనిచేస్తుంది. చర్మాన్ని, ఎముకలను ఆరోగ్యంగా ఉండచంలో కూడా విటమిన్ సి బాగా సహాయపడుతుంది. ప్రతి రోజూ ఉదయం పరగడుపున ఒక గ్లాస్ నిమ్మకాయ నీటిని తాగడం వల్ల శరీరంలోని మలినాలు ఈజీగా తొలగిపోతాయి.అలాగే ఈజీగా రక్తం శుద్ది అవుతుంది. శరీరం బాగా శుభ్రపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: