ప్రస్తుత కాలంలో మనుషులు ఎదుర్కొంటున్న అత్యంత పెద్ద ఆరోగ్య సమస్యల్లో కిడ్నీ ఫెయిల్యూర్ ఒకటి. ఒకప్పుడు ఈ సమస్య చాలా అరుదుగా మాత్రమే కనిపించేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రతి 100 మందిలో దాదాపు 30 మందికి పైగా ఈ సమస్య తలెత్తుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ మార్పుకు ప్రధాన కారణం మన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం వంటి అంశాలే. మూత్రపిండాలు  మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాలు. ఇవి లివర్ తర్వాత శరీరంలో పేరుకుపోయిన మలినాలను, వ్యర్థాలను బయటకు పంపించే ప్రధాన పని చేస్తాయి. యూరిన్ ద్వారా టాక్సిన్స్‌ను బయటకు పంపించడం, రక్తాన్ని శుద్ధి చేయడం, శరీరంలోని నీటి నిల్వలను సమతుల్యం చేయడం వంటి అనేక ముఖ్యమైన పనులు కిడ్నీలు నిర్వహిస్తాయి. అయితే ఒకసారి కిడ్నీల పనితీరు దెబ్బతింటే, టాక్సిన్స్ శరీరంలో పేరుకుపోయి అనేక రకాల సమస్యలకు దారితీస్తాయి. ఈ పరిస్థితిని సమయానికి గుర్తించకపోతే ప్రాణాపాయం కూడా తలెత్తే అవకాశం ఉంది.


ఇప్పుడు కిడ్నీలు పాడైపోయాయని ముందుగానే చెప్పగలిగే కొన్ని ముఖ్యమైన లక్షణాలను తెలుసుకుందాం:

1. తరచుగా యూరిన్‌కి వెళ్లడం : కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే శరీరంలోని వ్యర్థాలు బయటకు సరైన విధంగా వెళ్లవు. ముఖ్యంగా రాత్రిపూట తరచుగా యూరిన్‌కి వెళ్లడం ఒక పెద్ద సంకేతం. ప్రతి అరగంటకు, గంటకు ఒకసారి లేచి టాయిలెట్‌కి వెళ్తూ ఉంటే ఇది కిడ్నీల పనితీరు తగ్గిపోయిందని సూచిస్తుంది. ఈ లక్షణాన్ని లైట్‌గా తీసుకోవద్దు. వెంటనే డాక్టర్‌ను సంప్రదించి అవసరమైన టెస్టులు చేయించుకోవాలి.



2. మూత్ర పరిమాణం తగ్గిపోవడం లేదా మార్పులు రావడం : ముందు రోజులతో పోలిస్తే మూత్రం పరిమాణం చాలా తగ్గిపోతే లేదా ఎక్కువ మార్పులు కనపడితే ఇది కిడ్నీ డామేజ్‌కు సంకేతం కావచ్చు. మూత్రం మసకబారడం, నురగ ఎక్కువగా రావడం, ఆకుపచ్చటి లేదా ఎరుపు రంగు చాయలు రావడం, రక్తం తగులుకోవడం వంటి లక్షణాలు కూడా జాగ్రత్తగా గమనించాలి. ఇవి కిడ్నీలు సరైన విధంగా పనిచేయడం లేదని స్పష్టంగా చెబుతున్న సంకేతాలు.



3. శరీరంలో వాపులు రావడం : కిడ్నీలు సరిగా పనిచేయకపోతే శరీరంలోని మలినాలు బయటకు వెళ్లకపోవడం వల్ల నీటి నిల్వలు పెరిగి శరీరంలోని వేర్వేరు భాగాల్లో వాపులు వస్తాయి. ముఖ్యంగా కాళ్లు, చేతులు, ముఖం, కంటి కింద వాపు స్పష్టంగా కనిపించవచ్చు. ఇవి కూడా కిడ్నీ సమస్యకు గట్టి హెచ్చరిక సంకేతాలు.



అదనపు లక్షణాలు కూడా గమనించాలి:

*తీవ్రమైన అలసట, బలహీనత

*ఆకలి తగ్గిపోవడం

*శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

*గుండె వేగం పెరగడం

*మలబద్ధకం లేదా విరేచనాలు

ఈ లక్షణాలు ఎక్కువకాలం కొనసాగితే తప్పకుండా కిడ్నీ సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి. సమయానికి గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే ఈ సమస్యను నియంత్రించడం సాధ్యం. కిడ్నీ సమస్యలను నిర్లక్ష్యం చేయడం ప్రాణాపాయానికి దారితీస్తుంది. కాబట్టి శరీరంలో ఈ చిన్న లక్షణాలు కనపడగానే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించడం తప్పనిసరి.

మరింత సమాచారం తెలుసుకోండి: