ఇక తెలంగాణలో గత ఏడాదితో పోల్చితే ఈసారి హెచ్ఐవీ సంక్రమణ రేటు 0.44 నుంచి 0.41కు తగ్గిందని తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వివరాలు వెల్లడించింది. 2030 నాటికి ఎయిడ్స్ను ప్రజారోగ్య ముప్పు జాబితా నుంచి తొలగించే దిశగా చర్యలు చేపట్టినట్టు కూడా స్పష్టం చేసింది. ఇక ఐటీ రంగంలో గత కొంత కాలంగా హెచ్ఐవీ రేటు పెరగడానికి ప్రధాన కారణం వీరి అత్యాధునిక , విదేశీ తరహా ఆధునిక జీవనశైలీకి అలవాటు పడడం కూడా కారణం అంటున్నారు. వీరు వీకెండ్స్ పార్టీలలో విచ్చల విడి శృంగారానికి అలవాటు పడడం , ఎక్కువ మందితో శారీరక సంబంధాలు .. డ్రగ్స్ , మద్యం మత్తులో అరక్షిత శృంగారం చేయడం కూడా కారణం అని తెలుస్తోంది.
గతంలో గర్భం రాకుండా ఉండేందుకు చాలా మంది కండోమ్లు వాడేవారని.. కానీ ఇప్పుడు శృంగారం తర్వాత కూడా ఐపిల్ తరహా తక్షణ గర్భనిరోధక మాత్రలు వేసుకుంటున్నారు. దీంతో అరక్షిత శృంగారం పెరిగిందంటున్నారు. ఇక వ్యవసాయ కూలీలలో హెచ్ఐవీ పై పెద్దగా అవగాహన లేకపోవడం, తరచూ వివిధ ప్రాంతాలకు వలస వెళ్లడం కూడా వీరిలో ఈ రేటు పెరగడానికి కారణంగా తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి