ఆయుర్వేదం ప్రకారం వండిన ఆహారాన్ని కేవలం మూడు గంటల లోపు తినడం చాలా మంచిది.లేకపోతే పలు అనర్ధాలకు కారణమవుతుందట. ఎందుకంటే వండిన తర్వాత చాలా సమయానికి అందులో ఉండే పోషకాలను కోల్పోతుందని తెలియజేస్తున్నారు. అయితే పాత ఆహారాన్ని తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయట. తేమకు గురి కావడం వల్ల అనేక పోషకాలు తగ్గిపోయి ఆహారాన్ని బాక్టీరియా కారణం చేత క్రిములను ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయట. అందుచేతనే అన్నం వండిన వెంటనే ఏదైనా ఫాయిల్ తో కప్పి ఉంచడం మంచిది.


ఖచ్చితమైన విధంగా మసాలాలు వేయడం వల్ల పలు పోషకాహారాన్ని తయారు చేసుకోవచ్చు. ఇది సరిగ్గా లేకపోవడం వల్ల పోషకాలు తొలగిపోతాయి. ముఖ్యంగా మసాలాలు వంట చేసేటప్పుడు వేస్తారు. కొన్ని వంటలలో చివరిగా వేస్తూ ఉంటారు. ఎందుకంటే అవి వేడికి త్వరగా వాటిలో ఉండే పోషకాలు తొలగిపోతాయి కాబట్టి మీరు మిరియాలు,పసుపు మసాలా దినుసులు వంటివి సరిగ్గా వేయాలని గుర్తుంచుకోవాలి. కూరగాయలు వండేందుకు ఒక రాత్రి ముందు కట్ చేసి ఉంచడం మానివేయాలి. ఇది బ్యాక్టీరియా వ్యాధికారక క్రిములను సంతానోత్పత్తికి దారితీస్తుందట.


తాజా కూరగాయలు పండ్లను పోషకాలు ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటుంది. దీంతో ఇది ఫ్రెష్ గా ఉండేలా చేస్తూ ఉంటుంది. కూరగాయలు, మాంసాలు ఎక్కువగా వండడం వల్ల పోషకాహార క్రిములు చనిపోతాయని ఒక అపోహ ఉంటుంది. అయితే ఈ కారణంగా పోషకాలు కూడా నాశనం అవుతూ ఉంటాయని అనుకుంటూ ఉంటారు. అయితే ఎక్కువగా ఉడికించడం వల్ల పోషకాలు కరిగిపోతాయి.. క్యాలరీలు వస్తాయి.. అయినప్పటికీ క్యారెట్ ,పుట్టగొడుగులు ,  తదితర కూరగాయలు ఆకుకూరలు వండేటప్పుడు పోషకాలు తగ్గవని.. కేవలం పెరుగుతాయని వైద్యులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ప్రతి ఒక్కరు కూడా కూరగాయలను బాగా శుభ్రపరచిన తర్వాతనే వంటలోకి ఉపయోగిస్తూ ఉండాలి. అందుచేతనే ఎవరైనా సరే వంట వండేటప్పుడు కూరగాయలను కట్ చేస్తూ వండుకోవాలి.
.

మరింత సమాచారం తెలుసుకోండి: