పవన్ కళ్యాణ్ హీరోగా.. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బద్రి. ఈ సినిమా తో టాలీవుడ్ కి పరిచయమైంది ముద్దుగుమ్మ ఆమీషా పటేల్. ఇక ఆ తర్వాత మహేష్ బాబు నటించిన నాని, ఎన్టీఆర్ తో కలిసి నరసింహుడు, బాలకృష్ణతో కలిసి పరమవీరచక్ర వంటి సినిమాలలో నటించింది ఈ ముద్దుగుమ్మ. కానీ అన్ని సినిమాలు డిజాస్టర్ కావడంతో కేవలం బద్రి సినిమాతోనే మంచి పేరు సంపాదించుకుంది. ఇక ఈమె టాలీవుడ్ కి దూరంగా ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు కావస్తోంది. దీంతో ఈమె బాలీవుడ్ వైపు మకాం మార్చింది.

ఇదిలా ఉండగా తాజాగా అమీషా పటేల్ పై చీటింగ్ కేసు నమోదు అయినట్లుగా తెలుస్తోంది.. అసలు వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్లోని ఖాండ్వా లో ఓ ఈవెంట్ కోసం నిర్వాహకులు ఈ ముద్దుగుమ్మ ని సంప్రదించారట. అయితే ఈవెంట్ లో కేవలం ఓ గంట పాటూ. పాల్గొనేందుకు అక్షరాల రూ.4 లక్షల రూపాయలు అందుకుందట. కానీ ఈ ఈవెంట్ కు మాత్రం అరగంట అంటే కేవలం 30 నిమిషాలు మాత్రమే ఉన్నట్లు గా సమాచారం దీంతో నిర్వాహకులు ఆమె పై చీటింగ్ కేసు పెట్టినట్లు పోలీసులు తెలియజేయడం జరిగింది.


అయితే ఈ విషయంపై ఆమె స్పందిస్తూ.. ఏప్రిల్ 23వ తేదీన మధ్యప్రదేశ్లోని ఖాండ్వా సిటీలో నటించింది. మహోత్సవాలకు తను హాజరైన మాట వాస్తవమేనని తెలిపింది. స్టార్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ అరవింద్ పాండే ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన తీరు చాలా దారుణంగా ఉందని ఆమె తెలిపింది.. దీంతో ఆమె భయాందోళనలు కలిగాయని.. అయితే స్థానిక పోలీసులు తనకు రక్షణ కల్పించారని తెలిపింది. ఈ విషయాన్ని ట్వీట్ చేయడం జరిగింది. ఈ కారణంతోనే ఆమె అక్కడ ఎక్కువ సేపు ఉండలేక పోయాను అని  పరోక్షంగా చెప్పినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అమీషా గడర్ -2 సినిమా షూటింగ్ లో పాల్గొంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: