సినిమా ఇండస్ట్రీలో ఏ దర్శకుడైన బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం దక్కినట్లు అయితే ఆ దర్శకుడికి ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ లభిస్తూ ఉంటుంది. స్టార్ హీరోలు కూడా ఆ దర్శకులతో పని చేయాలని ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో కొంత మంది దర్శకులకు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం లభించినప్పటికీ సినిమా అవకాశాలు మాత్రం లభించక సూపర్ హిట్ సినిమా తర్వాత కూడా చాలా కాలం పాటు తదుపరి సినిమాను సెట్ చేసుకోవడానికి వెయిట్ చేస్తూ ఉండవలసి వస్తుంది.

 ప్రస్తుతం ఇలాంటి పరిస్థితినే దర్శకుడు సంపత్ నంది ఎదుర్కొంటున్నాడు. సంపత్ నంది, గోపీచంద్ హీరోగా తమన్నా హీరోయిన్ గా తెరకెక్కిన సీటీ మార్ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాడు. మహిళా కబడ్డీ నేపథ్యంలో దర్శకుడు సంపత్ నంది ఈ సినిమాని తెరకెక్కించాడు. ఈ సినిమాతో మంచి విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్న సంపత్ నందికి 'సిటీ మార్' సినిమా తర్వాతే అదిరిపోయే అవకాశం వస్తుంది అని చాలామంది అనుకున్నారు. కాకపోతే సిటీ మార్ సినిమా విడుదల ఇప్పటికే చాలా కాలం అవుతున్న ఇప్పటివరకు సంపత్ నంది  తన తదుపరి సినిమాను సెట్ చేసుకోలేకపోయాడు. అప్పట్లో ఆ హీరోతో సంపత్ నంది సినిమా సెట్ అయింది,  ఈ సినిమా సెట్ అయింది అంటూ అనేక వార్తలు బయటకు వచ్చాయి.

కాకపోతే ఇప్పటి వరకు అందుకు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సంపత్ నంది టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరోల్లో ఒకరైన నాగార్జున తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే సంపత్ నంది,  నాగార్జున కు ఒక కథను వినిపించినట్టు నాగార్జున కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.  మరి ఈ సినిమా అయిన సెట్ అవుతుందా లేకపోతే  తన తదుపరి సినిమా కోసం సంపత్ నంది ఇంకొంతకాలం వెయిట్ చేయాల్సి వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: