బాలీవుడ్ యంగ్ అండ్ హ్యాండ్సమ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా ఇంకా హాట్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతూ ఉన్నట్లు గత కొంతకాలంగా అనేక రకాల వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.షేర్షా మూవీ సమయం నుంచి కూడా వీరిద్దరు చాలా సన్నిహితంగా ఉంటున్నారని.. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ అనేది చిగురించిందని ఇండస్ట్రీలో టాక్ అనేది నడిచింది. అయితే తమపై వస్తున్న రూమర్స్ పట్లు ఈ ప్రేమపక్షులు ఇప్పటివరకు కూడా అసలు స్పందించలేదు. ఇక ఇటీవల కొద్దిరోజులుగా వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని టాక్ కూడా ఎక్కువగా నడుస్తోంది. త్వరలోనే వీరు తమ పెళ్ళి విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం తెలుస్తుంది. ఇక ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో పాల్గోన్న సిద్ధార్థ్ మల్హోత్రా కియారా తనకు బెస్ట్ ఫ్రెండ్ అని క్లారిటీ ఇచ్చేశాడు. ఇంకా అదే సమయంలో తనతో పెళ్లి జరిగితే తన ఫ్యూచర్ మరింత బాగుంటుందంటూ హింట్ కూడా ఇచ్చేసిన సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరి వివాహం గురించిన అసలు విషయాన్ని బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ లీక్ చేశారు.


హాట్ హీరోయిన్ కియారాతో కలిసి కాఫీ విత్ కరణ్ షోలో పాల్గోన్న షాహిద్ కపూర్… సిద్ధార్థ్ ఇంకా కియారా అద్వానీ మధ్య బంధం గురించి పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇక తాజాగా విడుదలైన ప్రోమో.. సిద్, కియారా గురించి కరణ్ ప్రశ్నిస్తుండగా.. షాహిద్ కపూర్ మాట్లాడుతూ.. ఈ ఏడాది చివరలో అంటే డిసెంబర్ నెలలో అతి పెద్ద ప్రకటన వచ్చే ఛాన్స్ కూడా ఉందని.. అది సినిమా గురించి మాత్రం కాదంటూ అతను చెప్పుకొచ్చాడు. దీంతో డిసెంబర్ నెలలో సిద్ ఇంకా కియారా పెళ్లికి సంబంధించిన అనౌన్స్ మెంట్ అనేది రానుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇంకా అలాగే తనకు సిద్దార్థ్ స్నేహితుల కంటే ఎక్కువ.. అతనెప్పుడూ తనకు ప్రత్యేకమే అని కియారా అద్వాని చెప్పుకొచ్చింది. దీంతో సిద్ ఇంకా కియారా నిజంగానే ప్రేమలో ఉన్నారంటూ బీటౌన్‎లో అనేక రకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి వీటిపై క్లారిటీ రావాలంటే ఖచ్చితంగా మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: