యంగ్ హీరో సంతోష్ శోభన్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న యూత్‌ఫుల్ లవ్ అండ్ క్రైమ్ ఎంటర్‌టైనర్ ‘లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్’ .

ఇందులో సంతోష్ సరసన జాతిరత్నాలు ఫేమ్ చిట్టి అలియాస్ ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ నవంబర్ 4న విడుదల కానుందట.. ప్రస్తుతం కు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. టీజర్, పాటలు అంచనాలను పెంచాయి. ఈ మూవీ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇటీవల చిత్రయూనిట్ అలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా జాతిరత్నాలు సమయంలో జరిగిన ఓ సంఘటనను అయితే గుర్తుచేసుకున్నారు ఫరియా..

ఫరియా అబ్దుల్లా కంటే.. చిట్టి అనే పేరుతోనే కదా నిన్ను బయట పిలుస్తున్నారు అని అలీ అనగా.. ఫరియా మాట్లాడుతూ.. ” ఓసారి క్యాబ్ లో వెళ్తున్నాను. డ్రైవర్ చాలా డల్ గా ఉన్నాడు. దీంతో ఏమైంది అన్నా అని మాట్లాడటం స్టార్ట్ చేశానని . వెంటనే అతను తన చిన్నప్పటి క్రష్ చిట్టి అని.. తన గురించి చెప్తూ బాధపడ్డాడు. ఓ అవునా అని నా పేరు కూడా చిట్టినే అని చెప్పాను.

వెంటనే రోడ్డు మధ్యలో కార్ ఆపేసి వెనక్కి తిరిగి ఏ స్కూల్ మీరు అని అడిగాడట . నేను షాకయ్యాను. అతను తన చిన్నప్పటి చిట్టిని నేను అనుకున్నాడు. మళ్లీ నా అసలు పేరు చెప్పి.. ఇది సినిమాలో నా పేరు అని చెప్పి మొత్తం వివరించిన తర్వాత కార్ స్టార్ట్ చేశాడు ” అంటూ చెప్పుకొచ్చింది. డైరెక్టర్ అనుదీప్ కెవి తెరకెక్కించిన జాతి రత్నాలు లో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి సరసన నటించింది ఫరియా. ఈ మూవీ ఆమె చిట్టి పాత్రలో అందంగా అలరించి అభిమానులకు ఆకట్టుకుందట.ప్రస్తుతం లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదే కాకుండా.. సూపర్ స్టార్ మహేష్ బాబు.. త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న మూవీలోనూ ఫరియా నటిస్తున్నట్లుగా వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన కూడా రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: