తాజాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం గాడ్ ఫాదర్.. ఈ సినిమాలో సత్యదేవ్ తో పాటు నయనతార కీలకపాత్ర పోషించారు . ఇక ఇందులో నయనతార చిరంజీవికి చెల్లిగా నటించడం విశేషం.ఇక చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది.అయితే  ఫస్ట్ వీకెండ్ లో ఈ సినిమా అంచనాలకు నుంచి కలెక్షన్లను సొంతం చేసుకుంది.వీక్ డేస్ లో ఈ సినిమాకు భారీ స్థాయిలో కలెక్షన్లు అయితే రాలేదు. అంతేకాదు ముఖ్యంగా ఈ సినిమాను అడ్వాన్సులు తీసుకొని నిర్మాతలు రిలీజ్ చేసినా మార్కెట్ లెక్కల ప్రకారం ఈ సినిమాకు సుమారుగా 15 కోట్ల రూపాయల నష్టం వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే  నిజానికి బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించినప్పటికీ ఆ కలెక్షన్ లు చిరంజీవి రేంజ్ కు తగిన స్థాయిలో లేవనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.ఇకపోతే గాడ్ ఫాదర్ సినిమాలో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే కమర్షియల్ అంశాలు కూడా లేవన్న సంగతి అందరికీ తెలిసిందే.ఇక  ఈ రీజన్ వల్లే సాధారణ ప్రేక్షకులు ఈ సినిమాపై ఆసక్తి చూపలేదు . ఇప్పటికే లూసిఫర్ సినిమాను చూసిన ప్రేక్షకులు గాడ్ ఫాదర్ సినిమా పై ఆసక్తి కనబరచలేదు. ఇదిలావుంటే మరోవైపు దసరా పండుగ కానుకగా మరికొన్ని సినిమాలు కూడా థియేటర్లలో విడుదల కావడం కూడా గాడ్ ఫాదర్ సినిమా కలెక్షన్ల పై ప్రభావం చూపింది…

గాడ్ ఫాదర్ తో పోల్చుకుంటే కాంతారా సినిమాకు మంచి గుర్తింపు లభించింది.ఇక  దేశవ్యాప్తంగా విపరీతంగా కలెక్షన్లు సాధించింది కాంతారా సినిమా అందుకే గాడ్ ఫాదర్ సినిమాకు కలెక్షన్లు కూడా తగ్గిపోయాయి.ఇక ఇప్పుడు దీపావళి పండుగ సెలవులు పూర్తయిన నేపథ్యంలో గాడ్ ఫాదర్ కు నామమాత్రపు కలెక్షన్లు కూడా వచ్చే అవకాశం కనిపించడం లేదు. అయితే గాడ్ ఫాదర్ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించక పోయినా కూడా చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.ఇక  అటు చిరంజీవి ఇటు రవితేజ కలిసి నటిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు కూడా పెరుగుతున్నాయి. చిరంజీవి తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: