మోడీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు దేశ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి సరికొత్త పథకాలను అందించడానికి ముందుకు వచ్చింది.. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నేషనల్ పెన్షన్ స్కీం లో మంచి రాబడిని చిన్న దుకాణదారులకు కూడా ఇవ్వడం గమనార్హం.. ఎవరైతే అసంఘటిత రంగాల్లో పని చేస్తున్నారో అలాంటి వారికి ఇది ఒక చక్కటి పథకం అని చెప్పవచ్చు.. 60 సంవత్సరాల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అందించే పెన్షన్ మినహాయిస్తే వారి దగ్గర ఇక ఏ మాత్రం డబ్బు ఉండదని చెప్పవచ్చు.. అలాంటి వారికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా మరో 3000 రూపాయలను అందివ్వడానికి సిద్ధమైంది. అయితే ఈ పెన్షన్ కూడా పొందాలి అంటే ఇందుకోసం మీరు నెల నెల కొంత డబ్బులు జమ చేయాల్సి ఉంటుంది.

ఈ పథకం కింద రీటైల్ ట్రేడర్లు.. స్వయం ఉపాధి పొందేవారు.. చిన్న చిన్న దుకాణాలు దారులు.. ఇలా తక్కువ జీతంతో పని చేసే వారు ఈ పథకంలో చేరడానికి అర్హులవుతారు.. ఈ పథకంలో చేరాలి అనుకుంటే నెలకు రూ.55 నుంచి 200 రూపాయల వరకు మీరు కంట్రిబ్యూట్  చేసుకోవచ్చు. ఇకపోతే కొన్ని షరతులు కూడా వర్తిస్తాయి.. అదేమిటంటే ఈ స్కీమ్లో రిజిస్టర్ చేసుకోవడానికి దుకాణదారుడు లేదా స్వయం ఉపాధి పొందేవారు సంవత్సరానికి రెండు లక్షలకు మించి ఆదాయం పొందకూడదు.

18 నుంచి 40 సంవత్సరాల వయసు ఉన్నవారు ఈ పథకంలో చేరవచ్చును.. మొత్తంగా 3.25 లక్షల కామెంట్ సర్వీస్ సెంటర్ల ద్వారా ఈ పథకంలో రిజిస్టర్ చేసుకోవచ్చు.. ఇక ఈ స్కీమ్ లో రిజిస్టర్ అయిన లబ్ధిదారుడు ఒకవేళ ప్రమాదవశాత్తు మరణిస్తే.. నామిని కి పెన్షన్ లో 50% పెన్షన్ అందివ్వడం జరుగుతుంది.. ముఖ్యంగా ఆధార్ కార్డు, సేవింగ్స్ బ్యాంక్, జన్ ధన్  అకౌంట్ నెంబర్ ను తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: